News September 13, 2025
తాగునీటి చెరువులో పడి మూడేళ్ల చిన్నారి మృతి

అత్తిలి మండలం రామన్నపేటలో శనివారం విషాద ఘటన చోటుచేసుకుంది. అంగన్వాడీ పాఠశాలలో చదువుతున్న సప్పా మోహిత (3) అనే చిన్నారి మధ్యాహ్నం భోజనం చేసి ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తు దగ్గరలో ఉన్న మంచినీటి చెరువులో పడి మృతి చెందింది. ఘటన సమయంలో అంగన్వాడీ కేంద్రంలో టీచర్, ఆయమ్మ లేకపోవడంతో ఈ దుర్ఘటన జరిగినట్లు తెలుస్తోంది. తాపీ పని చేసుకునే మోహిత తండ్రి శివ కుటుంబాన్ని ఈ ఘటన తీవ్ర విషాదంలో ముంచింది.
Similar News
News March 31, 2026
తణుకు జాతీయ రహదారిపై యాక్సిడెంట్

తణుకు జాతీయ రహదారిపై మంగళవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆటో బోల్తా పడింది. తాడేపల్లిగూడెం నుంచి తణుకు వైపు ఫ్రూట్స్ లోడుతో వస్తున్న ఆటో తేతలి వై జంక్షన్ సమీపంలో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో ఆటోలో ఉన్న డ్రైవర్ క్షేమంగా బయటపడడంతో అంతా ఊపిరిపించుకున్నారు. ఈ ప్రాంతంలో ఫ్లై ఓవర్ నిర్మాణ పనులు మధ్యలోనే నిలిచిపోవడంతో తరచూ ఇక్కడ ప్రమాదాలు జరుగుతున్నాయి.
News March 31, 2026
తణుకు జాతీయ రహదారిపై యాక్సిడెంట్

తణుకు జాతీయ రహదారిపై మంగళవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆటో బోల్తా పడింది. తాడేపల్లిగూడెం నుంచి తణుకు వైపు ఫ్రూట్స్ లోడుతో వస్తున్న ఆటో తేతలి వై జంక్షన్ సమీపంలో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో ఆటోలో ఉన్న డ్రైవర్ క్షేమంగా బయటపడడంతో అంతా ఊపిరిపించుకున్నారు. ఈ ప్రాంతంలో ఫ్లై ఓవర్ నిర్మాణ పనులు మధ్యలోనే నిలిచిపోవడంతో తరచూ ఇక్కడ ప్రమాదాలు జరుగుతున్నాయి.
News March 31, 2026
భీమవరం: బాలికపై లైంగిక దాడి.. 20ఏళ్ల జైలు..!

8ఏళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తికి భీమవరం పోక్సో కోర్టు జడ్జ్ బీ.లక్ష్మీనారాయణ 20ఏళ్ల జైలు శిక్ష విధించారు. కాళ్ల మండలం దొడ్డనపూడి గ్రామంలో 2021లో జరిగిన ఈ ఘటనపై కాళ్ల పోలీసు స్టేషన్లో అప్పట్లో పోక్సో కేసు నమోదైంది. విచారణ అనంతరం నేరస్థుడికి కఠిన కారాగార శిక్షతోపాటు రూ.15వేల జరిమానా విధించారు. బాధితురాలుకి రూ.50,000ల నష్టపరిహారం చెల్లించాలని న్యాయమూర్తి తుది తీర్పును వెలువరించారు.


