News April 4, 2024
‘కావలి’ ప్రజలకు ఎవరు కావాలో?

AP: నెల్లూరు జిల్లాలోని కావలి నియోజకవర్గంలో 1952 నుంచి 15సార్లు ఎన్నికలు జరిగాయి. 6సార్లు INC, 3సార్లు TDP, YCP 2సార్లు, కిసాన్ మజ్దూర్, ప్రజా పార్టీ, స్వతంత్ర పార్టీ ఒక్కోసారి, ఇండిపెండెంట్ ఓసారి గెలిచారు. 2014, 19లో YCP నుంచి గెలిచిన ప్రతాప్ కుమార్ హ్యాట్రిక్ సాధిస్తానని ధీమాగా ఉండగా, TDP నుంచి కావ్య కృష్ణారెడ్డి తనదే గెలుపంటున్నారు. ఇద్దరికీ ఆర్థిక, అంగబలం ఉండటంతో పోటీ రసవత్తరంగా ఉండనుంది.
<<-se>>#ELECTIONS2024<<>>
Similar News
News January 28, 2026
‘బారామతి’తో అజిత్ పవార్కు విడదీయరాని బంధం

మహారాష్ట్ర Dy.CM అజిత్ పవార్ ఫ్లైట్ క్రాష్లో చనిపోయిన విషయం తెలిసిందే. బారామతితో ఆయనకు విడదీయరాని బంధముంది. అక్కడి ప్రజలను ఆయన తన సొంతం కుటుంబంగా అభివర్ణిస్తుంటారు. 1991 నుంచి 2024 ఎన్నికల వరకు బారామతి ప్రజలు ఆయన వెనుకే నడిచారు. పవార్ vs పవార్ వార్(2024)లోనూ అక్కడి ప్రజలు అజిత్కు లక్ష మెజారిటీ కట్టబెట్టారు. బారామతి నుంచే తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆయన అదే మట్టిలో కలిసిపోయారు.
News January 28, 2026
మేడారం జాతరలో బెల్లమే బంగారం.. ఎందుకంటే?

TG: ఆసియాలోనే అతిపెద్ద గిరిజన పండుగగా పేరొందిన మేడారం మహాజాతర నేటి నుంచి ప్రారంభమైంది. ఈ జాతరలో భక్తులు అమ్మవార్లకు ఇచ్చే ప్రధాన కానుక బెల్లం. గిరిజన సంప్రదాయంలో బెల్లాన్ని ప్రకృతి ప్రసాదంగా భావిస్తారు. బంగారంతో సమానంగా చూస్తారు. అందుకే ‘నిలువెత్తు బంగారం’ అంటారు. కోరికలు తీరితే తమ బరువుకు సమానంగా తులాభారం వేసి సమర్పిస్తారు. గద్దెల వద్ద బెల్లం ముక్కలను నైవేద్యంగా పెట్టి ప్రసాదంగా తీసుకుంటారు.
News January 28, 2026
వాడియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ హిమాలయన్ జియాలజీలో ఉద్యోగాలు

<


