News September 13, 2025
బాపట్ల జిల్లా SP తుషార్ డూడీ బదిలీ..!

రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో ఎస్పీలు, కలెక్టర్లను ప్రభుత్వం బదిలీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బాపట్ల జిల్లా ఎస్పీగా ఉమామహేశ్వర్ను నియమిస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే బాపట్ల జిల్లా ఎస్పీగా పనిచేస్తున్న తుషార్ డూడీని చిత్తూరుకు బదిలీ చేశారు. ఆయన స్థానంలో ఉమామహేశ్వర్ను నియమించారు.
Similar News
News March 15, 2026
ALERT: HYDలో ఈ రూట్లలో వెళ్లొద్దు

HYDలో నేడు భారీ ఈవెంట్లు జరగనున్నాయి. యూసుఫ్గూడలో ‘<<19385959>>ఉస్తాద్ భగత్ సింగ్<<>>’ ప్రీరిలీజ్, LBస్టేడియంలో ‘ఇఫ్తార్’తో రోడ్లు క్లోజ్ అవ్వనున్నాయి. జూబ్లీహిల్స్ చెక్పోస్ట్↦ KVBR స్టేడియం↦ పంజాగుట్ట, మైత్రీవనం↦ కృష్ణానగర్ జంక్షన్↦ జూబ్లీహిల్స్, మాదాపూర్..
ఎల్బీస్టేడియం↦ ARపెట్రోల్ పంప్, బషీర్బాగ్, సుజాత స్కూల్ రోడ్లు క్లోజ్ అవుతాయి. లక్డికాపూల్, రవీంద్రభారతి, లిబర్టీ వద్ద రద్దీ ఉంటుందని పోలీసులు తెలిపారు.
News March 15, 2026
మచిలీపట్నంలో రేపు మీకోసం: కలెక్టర్

ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీకోసం కార్యక్రమాన్ని మచిలీపట్నంలోని కలెక్టరేట్లో సోమవారం ఉదయం 10:30 గంటలకు ప్రారంభం కానుంది. ఈ మేరకు కలెక్టర్ డీకే బాలాజీ ఆదివారం ప్రకటన విడుదల చేశారు. జిల్లా ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ఈ కార్యక్రమంలో పాల్గొని సంబంధిత అధికారులకు అర్జీలు అందించి, పరిష్కారం పొందాలని సూచించారు.
News March 15, 2026
VZM: జిల్లాలో 1,11,369 మంది అభ్యాసకులు అక్షరాంధ్ర పరీక్షకు హాజరు

విజయనగరం జిల్లా వ్యాప్తంగా అక్షరాంధ్ర పరీక్షను 1,277 పరీక్ష కేంద్రాల్లో నిర్వహించగా 1,11,369 మంది అభ్యాసకులు హాజరైనట్లు జిల్లా కలెక్టర్ రాం సుందర్ రెడ్డి తెలిపారు. సాయంత్రం ఐదు గంటల తర్వాత పరీక్ష పేపర్ మూల్యాంకనం చేసి ఫలితాలు వెల్లడించనున్నట్లు పేర్కొన్నారు.


