News April 4, 2024

బీఆర్‌ఎస్‌, బీజేపీపై మంత్రి జూపల్లి తీవ్ర వ్యాఖ్యలు

image

పార్లమెంట్‌ ఎన్నికల తరువాత బీఆర్‌ఎస్‌ భూస్థాపితం అవుతుందని మంత్రి జూపల్లి కృష్ణారావు వ్యాఖ్యానించారు. నేడు నాగర్ కర్నూల్ పార్లమెంట్‌ నియోజకవర్గ ముఖ్యకార్యకర్తల సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మల్లు రవి పదవుల కోసం ఏనాడూ పార్టీ మారలేదన్నారు. బీజేపీ తరఫున పోటీ చేస్తున్న భరత్‌ పదవుల కోసం పార్టీ మారారని, బీఆర్‌ఎస్‌ తరఫున పోటీ చేస్తున్న ప్రవీణ్‌కుమార్‌ గత 10ఏళ్లు నాటకం ఆడారని జూపల్లి పేర్కొన్నారు.

Similar News

News September 30, 2024

NRPT: గురుకుల పాఠశాలలో కలెక్టర్ రాత్రి బస

image

నారాయణపేట జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో కలెక్టర్ సిక్తా పట్నాయక్ సోమవారం రాత్రి బస చేశారు. రాత్రి గురుకుల పాఠశాలను ఆకస్మికంగా సందర్శించిన కలెక్టర్ పాఠశాల వంటగదికి వెళ్లి విద్యార్థులకు అందిస్తున్న భోజన, వసతి సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు. వంట సామాగ్రి, నిత్యావసర సరుకులను, తాగునీటిని పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేసి అక్కడే పాఠశాలలో నిద్రించారు.

News September 30, 2024

ఉమ్మడి జిల్లాలో నేటి ముఖ్య వార్తలు.. !

image

✒దౌల్తాబాద్:అంత్యక్రియలకు వెళ్తూ ట్రాక్టర్ బోల్తా.. వ్యక్తి మృతి
✒ఉమ్మడి జిల్లాలో దసరా వేడుకలు షురూ
✒మెదక్ పై పాలమూరు ఘనవిజయం..ఇక సెమి ఫైనల్
✒GDWL: మహిళపై అత్యాచారయత్నం.. కేసు నమోదు
✒దోపిడీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించాలి:RS ప్రవీణ్
✒రైతు డిక్లరేషన్‌ను కాంగ్రెస్ తుంగలో తొక్కింది: డీకే అరుణ
✒DSC ఫలితాలు విడుదల..1:3 పై ఫోకస్
✒నల్లమలలో టైగర్ సఫారీ రెడీ.. ఇక ఆన్లైన్ బుకింగ్

News September 30, 2024

నిబంధనల మేరకు ధాన్యం కొనుగోలు చేయాలి: సిక్తా పట్నాయక్

image

ప్రభుత్వ నిబంధనలు అనుసరించి వరి ధాన్యం కొనుగోలు చేయాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. సోమవారం నారాయణపేట శివారులోని వృత్తి నైపుణ్య అభివృద్ధి కేంద్రంలో సంబంధిత అధికారులు, రైస్ మిల్లర్లు, కొనుగోలు కేంద్రాల నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో సన్న రకం వరి ధాన్యం మాత్రమే కొనుగోలు చేయాలని, దొడ్డు రకం వరి ధాన్యం కొనుగోలు చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.