News September 13, 2025
HYD: మరీ ఇంత బరితెగింపా..? రేవంత్ రెడ్డి..!: RSP

రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ గురుకులంలో విషాహారం తిని 20 మంది అమ్మాయిలు అనారోగ్యానికి గురయ్యారు. ట్రీట్మెంట్ చేయించకుండా మీరే నయం చేసుకోండని చేతులు దులుపుకోవడం ఏంటని BRS రాష్ట్ర ప్రధాన కార్యదర్శి RS ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి ఇంత బరితెగింపా అని ఫైర్ అయ్యారు. ఈ అమ్మాయి ప్రస్తుతం జహీరాబాద్లో తన ఇంట్లో చికిత్స పొందుతోందని ఆయన Xలో ట్వీట్ చేశారు.
Similar News
News September 13, 2025
VZM: ‘షరతులు లేకుండా వాహన మిత్ర అమలు చేయాలి’

వాహన మిత్ర సంక్షేమ పథకంలో ఎలాంటి షరతులు లేకుండా ఆటో, మ్యాక్సీ, టాక్సీ, జీపు, టాటా మ్యాజిక్ డ్రైవర్లందరికీ అమలు చేయాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి అశోక్ డిమాండ్ చేశారు. విజయనగరంలోని బుచ్చన్న కోనేరు వద్ద కార్మికులతో శనివారం సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. నెలకు 5వేల పింఛన్తో కూడిన సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
News September 13, 2025
వరంగల్: లోక్ అదాలత్లో 5,938 కేసుల పరిష్కారం

జాతీయ లోక్ అదాలత్లో వరంగల్, హనుమకొండ జిల్లాల్లో ఏర్పాటు చేసిన 10 బెంచీలలో మొత్తం 5,938 కేసులు పరిష్కారమయ్యాయి. పరిష్కారమైన కేసుల్లో 26 సివిల్ కేసులు, 24 MVOP కేసులు, 5,912 క్రిమినల్ కేసులు, 76,720 బ్యాంక్ PLC కేసులు ఉన్నాయి. లయన్స్ క్లబ్ అధ్యక్షుడు డేవిడ్ రాజ్కుమార్ కక్షిదారులకు 300 పులిహోర ప్యాకెట్లను పంపిణీ చేశారు. లోక్ అదాలత్ విజయవంతానికి సహకరించిన వారందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
News September 13, 2025
జగిత్యాల: శాంతి భద్రతలకు విఘాతం.. పీడీ యాక్ట్ నమోదు

శాంతి భద్రతలకు భంగం కలిగించిన వ్యక్తిపై పిడి యాక్ట్ నమోదు చేసినట్లు జగిత్యాల ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. జగిత్యాల విద్యానగర్కు చెందిన బండి తరాల శ్రీకాంత్పై పలుమార్లు కేసులు నమోదైనా, అతని ప్రవర్తనలో మార్పు రాలేదని పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలో, అతనిపై పిడి యాక్ట్ నమోదు చేసి కరీంనగర్ జైలులో ఉంచి, చర్లపల్లి జైలుకు తరలించినట్లు ఎస్పీ చెప్పారు.