News September 13, 2025
అశ్వారావుపేట: వాగులో ఇద్దరు మహిళలు గల్లంతు

అశ్వారావుపేట మండలం కావడి గుండ్ల వాగులో ఈరోజు కురిసిన భారీ వర్షాలకు ఇద్దరు మహిళలు కొట్టుకుపోయారు. స్థానికుల వివరాల ప్రకారం.. పత్తి చేనులో పనికి వెళ్లిన చెన్నమ్మ(50), వరలక్ష్మి (55) వాగు దాటే క్రమంలో గల్లంతయ్యారు.వారు ఏపీకి చెందిన వారిగా స్థానికులు గుర్తించారు. పనికి వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో గల్లంతయ్యారని తెలిపారు. వరద ఉద్ధృతిలో చిక్కుకున్న వారిలో నలుగురు ఒడ్డుకు చేరుకోగా ఇద్దరు గల్లంతయ్యారు.
Similar News
News September 13, 2025
జనగామ జిల్లాలో నేటి టాప్ న్యూస్!

> జనగామ: యూరియా దొరకక రైతుల ఇక్కట్లు
> గానుగుపహాడ్ బ్రిడ్జి నిర్మించాలని వాహనదారులు, స్థానికుల ధర్నా
> దిక్సూచి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి: కలెక్టర్
> దేవరుప్పుల: షేక్ బందగి స్తూపం వద్ద నివాళులు అర్పించిన సీపీఎం నేతలు
> డాక్టరేట్ పొందిన మచ్చుపహాడ్ వాసి
> స్టేషన్ ఘనపూర్: బెట్టింగ్ కోసం దొంగతనాలు.. ఒకరి అరెస్ట్
> చిన్న పెండ్యాల: రైలు కిందపడి బర్రెలు మృతి
News September 13, 2025
‘మిరాయ్’ ఐడియా అప్పుడే పుట్టింది: దర్శకుడు కార్తీక్

‘మిరాయ్’ మూవీ ఐడియా 2015-16లో పుట్టిందని దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని చెప్పారు. చనిపోయిన తన ఫ్రెండ్ అస్థికలు కలిపేందుకు రామేశ్వరం వెళ్తున్న సమయంలో కథకు బీజం పడిందని పేర్కొన్నారు. ఆ సమయంలో గద్ద తనతో పాటు ట్రావెల్ చేస్తున్నట్లు అనిపించిందని, అలా కథ పుట్టిందన్నారు. మిరాయ్ అనేది జపనీస్ పదమని, దానికి అర్థం ఫ్యూచర్ అని తెలిపారు. ఈ మూవీ కథ రాసేందుకు 5-8 ఏళ్లు పట్టిందన్నారు.
News September 13, 2025
ఏలూరు: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్లో జిల్లాస్థాయి ఎంపిక పోటీలు

స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో అన్ని స్కూల్ యాజమాన్యాల అండర్-14,17 వయసున్న బాల, బాలికల జిల్లాస్థాయి ఎంపికలు నిర్వహిస్తున్నామని జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కార్యదర్శి అలివేలుమంగ శనివారం తెలిపారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా విద్యార్థుల ఎంపిక ఈనెల 16న స్విమ్మింగ్, వెయిట్ లిఫ్ట్ పోటీలు ASR స్టేడియంలో, 17న కరాటే పోటీలు ఏలూరు రామచంద్రపురం కాస్మో పొలిటిక్స్ క్లబ్లో జరుగుతాయి.