News September 13, 2025
కృష్ణా జలాల్లో 71% వాటా డిమాండ్ చేస్తున్నాం: ఉత్తమ్

TG: నదీ జలాల వాటా సాధనలో రాష్ట్ర ప్రయోజనాలకు కట్టుబడి ఉన్నామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. 811 TMCల కృష్ణా జలాల్లో 71% డిమాండ్ చేస్తున్నామని తెలిపారు. చుక్కనీటిని వదులుకునే ప్రసక్తి లేదని తేల్చిచెప్పారు. ఈ నెల 23న ఢిల్లీలో జరిగే కృష్ణా ట్రిబ్యునల్-2 సమావేశంలో బలంగా వాదిస్తామన్నారు. గత పాలకుల ఉదాసీనత వల్ల ఏపీ అక్రమంగా నీటిని తరలించుకొని ప్రయోజనం పొందిందని విమర్శించారు.
Similar News
News February 5, 2026
90 రోజులుగా నో ఛార్జ్షీట్.. ‘శబరిమల’ నిందితుడికి బెయిల్!

శబరిమల బంగారం చోరీ కేసులో ప్రధాన నిందితుడు ఉన్నికృష్ణన్ పొట్టికి రెండో కేసులోనూ బెయిల్ వచ్చింది. అతడిని అరెస్టు చేసి 90 రోజులైనా SIT ఛార్జ్షీట్ దాఖలు చేయకపోవడంతో కేరళ కోర్టు statutory bail మంజూరు చేసింది. ద్వారపాలక విగ్రహం, గర్భగుడి తలుపుల ఫ్రేమ్స్లో బంగారం మాయంపై 2కేసులు అతడిపై నమోదయ్యాయి. దర్యాప్తులో తప్పు జరుగుతోందన్న తమ ఆరోపణలు ఈ బెయిల్తో నిజమని తేలాయని ప్రతిపక్షాలు మండిపడ్డాయి.
News February 5, 2026
సంకటహర చతుర్థి.. సాయంత్రం ఇలా చేయండి!

సంకటహర చతుర్థి ఎంతో విశిష్ఠమైందని పండితులు చెబుతున్నారు. ‘ఇవాళ విఘ్నాలకు అధిపతి అయిన గణపతిని భక్తితో పూజిస్తే జీవితంలోని సంకటాలు, విఘ్నాలు తొలగిపోతాయి. రోజంతా ఉపవాసం ఉండాలి. సాయంత్రం చంద్రుడిని దర్శించుకుని అర్ఘ్యం(నీళ్లు) సమర్పించాలి. తర్వాత గణేశుడిని పూజించుకోవాలి. కచ్చితంగా చంద్ర దర్శనం తర్వాతే ఉపవాసం విరమించుకోవాలి. ఇలా చేస్తే మనో ధైర్యం పెరిగి, బుద్ధి వికసిస్తుంది’ అని చెబుతున్నారు.
News February 5, 2026
ఐఐటీ హైదరాబాద్లో ప్రాజెక్ట్ స్టాఫ్ పోస్టులు

<


