News September 13, 2025
గుంటూరు: పిడుగుపాటుకు గురై మహిళా కూలీల మృతి

గుంటూరు జిల్లాలో పిడుగుపాటుకు గురై ఇవాళ ఒక్కరోజే నలుగురు మహిళలు మృతి చెందారు. పెదకాకాని మండలం నంబూరులో పొలం పనులకు వెళ్లిన మహిళా కూలీలపై పిడుగు పడింది. ఈ దుర్ఘటనలో దాసరి రాణి( 41), దాసరి సారమ్మ (39)అక్కడికక్కడే మృతి చెందారు. పెదనందిపాడు(M) అన్నపర్రులో పొలం పనులు ముగించుకుని వస్తుండగా పిడుగు పడి దేవరపల్లి సామ్రాజ్యం, తన్నీరు నాగమ్మ చనిపోయారు. దీంతో ఆయా కుటుంబాలు తీవ్ర విషాదంలో మునిగిపోయాయి.
Similar News
News September 14, 2025
బాలయ్య తరఫున సీఎంకు రూ.50 లక్షల చెక్కు అందజేత

TG: భారీ వర్షాలు, వరదలతో నష్టపోయిన కామారెడ్డి సహా ఇతర ప్రాంతాల రైతులకు అండగా నిలిచేందుకు CMRFకు నందమూరి బాలయ్య రూ.50 లక్షల పరిహారం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు చెక్కును ఆయన తరఫున చిన్న కూతురు తేజస్విని సీఎం రేవంత్కు అందజేశారు. ఇటీవల విరాళం ప్రకటించిన సందర్భంగా భవిష్యత్తులోనూ తన వంతుగా ఇలాంటి సహాయాలు చేస్తానని బాలయ్య పేర్కొన్నారు.
News September 14, 2025
ఎల్.ఐ.సీ కరీంనగర్ డివిజన్ కో-కన్వీనర్గా ఆమందు రాజ్కుమార్ ఎన్నిక

ఎల్.ఐ.సీ ఏజెంట్స్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా కరీంనగర్ డివిజన్ కో-కన్వీనర్గా జగిత్యాలకు చెందిన ఆమందు రాజ్కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. డివిజన్ కమిటి సభ్యులుగా రేగొండ లక్ష్మీకాంతం, రౌతు నర్సయ్యను ఎన్నుకున్నారు. మంచిర్యాలలో జరిగిన మహాసభలో గాదాసు శ్రీనివాస్ కన్వీనర్గా ఎంపికయ్యారు. ఎన్నికైన వారికి జగిత్యాల బ్రాంచ్ అభినందనలు తెలిపింది.
News September 14, 2025
జూబ్లీహిల్స్: వర్షంలోనూ మాగంటి కుమార్తెల పర్యటన..!

జూబ్లీహిల్స్లో BRSని ప్రజలు గెలిపించాలని మాజీ MLA మాగంటి గోపీనాథ్ కుమార్తెలు అక్షర, దిశిర కోరారు. ఈ మేరకు వర్షాన్ని సైతం లెక్కచేయకుండా ఈరోజు నియోజకవర్గ పరిధి రహమత్నగర్ డివిజన్ ఓం నగర్ కాలనీలో పర్యటించారు. BRSమహిళా నాయకులతో కలిసి ఇంటింటికీ వెళ్లి ప్రజలను ఆత్మీయంగా పలకరించారు. ప్రజల ఆశీస్సులు, సహకారంతోనే తమ తండ్రి గోపీనాథ్ 3సార్లు గెలిచారన్నారు. ప్రజాసమస్యలు పరిష్కరించడమే తమ ప్రధాన ధ్యేయమన్నారు.