News September 13, 2025

HYD: ALERT.. రేపు ట్రాఫిక్ డైవర్షన్ (1/2)

image

SEP 14న ఉ.8 నుంచి రా.8 వరకు HYDలో ట్రాఫిక్ డైవర్షన్ అమలులో ఉంటుందని HYD పోలీసులు తెలిపారు. ఫలక్‌నుమా, ఇంజిన్ బౌలి, నాగుల్‌చింత క్రాస్ రోడ్, హిమ్మత్‌పురా జంక్షన్, వోల్గా, హరిబౌలి, పంచ్ మోహల్లా, చార్మినార్, గుల్జార్ హౌస్, పత్తర్‌గట్టి, మదీనా జంక్షన్, డెల్హీ గేట్, నాయాపూల్, ఎస్.జె.రోటరీ జంక్షన్, దారుల్‌షిఫా, పూరాణీ హవెలీలో రోడ్డు బంద్, డైవర్షన్ కొనసాగుతుంది.

Similar News

News September 14, 2025

బాలయ్య తరఫున సీఎంకు రూ.50 లక్షల చెక్కు అందజేత

image

TG: భారీ వర్షాలు, వరదలతో నష్టపోయిన కామారెడ్డి సహా ఇతర ప్రాంతాల రైతులకు అండగా నిలిచేందుకు CMRFకు నందమూరి బాలయ్య రూ.50 లక్షల పరిహారం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు చెక్కును ఆయన తరఫున చిన్న కూతురు తేజస్విని సీఎం రేవంత్‌కు అందజేశారు. ఇటీవల విరాళం ప్రకటించిన సందర్భంగా భవిష్యత్తులోనూ తన వంతుగా ఇలాంటి సహాయాలు చేస్తానని బాలయ్య పేర్కొన్నారు.

News September 14, 2025

ఎల్‌.ఐ.సీ కరీంనగర్ డివిజన్ కో-కన్వీనర్‌గా ఆమందు రాజ్‌కుమార్ ఎన్నిక

image

ఎల్‌.ఐ.సీ ఏజెంట్స్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా కరీంనగర్ డివిజన్ కో-కన్వీనర్‌గా జగిత్యాలకు చెందిన ఆమందు రాజ్‌కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. డివిజన్ కమిటి సభ్యులుగా రేగొండ లక్ష్మీకాంతం, రౌతు నర్సయ్యను ఎన్నుకున్నారు. మంచిర్యాలలో జరిగిన మహాసభలో గాదాసు శ్రీనివాస్ కన్వీనర్‌గా ఎంపికయ్యారు. ఎన్నికైన వారికి జగిత్యాల బ్రాంచ్ అభినందనలు తెలిపింది.

News September 14, 2025

జూబ్లీహిల్స్: వర్షంలోనూ మాగంటి కుమార్తెల పర్యటన..!

image

జూబ్లీహిల్స్‌లో BRSని ప్రజలు గెలిపించాలని మాజీ MLA మాగంటి గోపీనాథ్ కుమార్తెలు అక్షర, దిశిర కోరారు. ఈ మేరకు వర్షాన్ని సైతం లెక్కచేయకుండా ఈరోజు నియోజకవర్గ పరిధి రహమత్‌నగర్ డివిజన్‌ ఓం నగర్ కాలనీలో పర్యటించారు. BRSమహిళా నాయకులతో కలిసి ఇంటింటికీ వెళ్లి ప్రజలను ఆత్మీయంగా పలకరించారు. ప్రజల ఆశీస్సులు, సహకారంతోనే తమ తండ్రి గోపీనాథ్ 3సార్లు గెలిచారన్నారు. ప్రజాసమస్యలు పరిష్కరించడమే తమ ప్రధాన ధ్యేయమన్నారు.