News September 14, 2025

VJA: జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం అప్డేట్

image

మచిలీపట్నం-విజయవాడ జాతీయ రహదారిపై శనివారం రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఇరువురు వ్యక్తులు దుర్మరణం చెందినట్లు గూడూరు పోలీసులు తెలిపారు. మృతి చెందిన వ్యక్తులు విజయవాడ శివారు తాడిగడపకు చెందిన ఆదాం బాబు, షరీన్‌గా పోలీసులు గుర్తించారు. వీరు ద్విచక్ర వాహనంపై మచిలీపట్నం బీచ్‌కి వెళుతుండగా ప్రమాదం చోటు చేసుకున్నట్లు చెప్పారు.

Similar News

News September 14, 2025

నల్గొండ: లోక్ అదాలత్‌లో 13,814 కేసుల పరిష్కారం

image

జాతీయ మెగా లోక్ అదాలత్‌లో నల్గొండ జిల్లాలో 13,814 కేసులు పరిష్కారమయ్యాయి. జాతీయ న్యాయ సేవా ప్రాధికార సంస్థ ఆదేశాల మేరకు లోక్ అదాలత్‌ విజయవంతంగా ముగిసిందని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. ఈ లోక్ అదాలత్‌లో పరిష్కరించిన 135 సైబర్ క్రైమ్ కేసుల బాధితులకు రూ. 54,08,392 తిరిగి చెల్లించినట్లు ఆయన పేర్కొన్నారు.

News September 14, 2025

HYD: ‘BRS విష ప్రచారాలను తిప్పి కొట్టాలి’

image

గ్రూప్-1 పరీక్షపై BRS చేస్తున్న విష ప్రచారాలను ప్రతీ కాంగ్రెస్ కార్యకర్తల తిప్పికొట్టాలని రాష్ట గ్రంథాలయ ఛైర్మన్ రియాజ్ పిలుపునిచ్చారు. హైకోర్ట్ తీర్పును తాము ఎల్లప్పుడూ గౌరవిస్తామని స్పష్టంచేశారు. గ్రూప్-1 పోస్టులు అమ్ముకున్నారని మాట్లాడిన KTRపై చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులను కోరారు. అసత్య ప్రచారాలు మానుకోవాలని BRS నాయకులకు హితవు పలికారు.

News September 14, 2025

మహిళా శక్తి కారణంగానే భారత్‌కు గుర్తింపు: ఓంబిర్లా

image

AP: భరత భూమిలో మహిళా నాయకత్వం శతాబ్దాలకు ముందే ప్రారంభమైందని లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా తెలిపారు. తిరుపతిలో జరుగుతున్న మహిళా సాధికారత సదస్సులో ఆయన మాట్లాడారు. ‘స్త్రీలకు గౌరవమివ్వడం ఆది నుంచి వస్తున్న సంప్రదాయం. స్వాతంత్ర్య పోరాటంలోనూ వారు కీలకపాత్ర పోషించారు. సామాజిక బంధనాలు తెంచుకొని అనేక ఉద్యమాలు చేశారు. మహిళా శక్తి కారణంగానే ప్రపంచంలోనే ముఖ్య దేశంగా భారత్ అవతరించింది’ అని చెప్పారు.