News September 14, 2025
HYD: ట్రాఫిక్ సమస్యలు.. మెట్రో ఎక్కిన బీజేపీ చీఫ్

దశాబ్ద కాలం అధికారంలో ఉన్న బీఆర్ఎస్, ఆ తర్వాత వచ్చిన కాంగ్రెస్ HYDలో రోడ్లు, డ్రైనేజీ, ప్రజా రవాణా వ్యవస్థలను పూర్తిగా నిర్లక్ష్యం చేశాయని బీజేపీ స్టేట్ చీఫ్ రాంచందర్రావు విమర్శించారు. ఇటీవల కురిసిన వర్షాలకు నగరంలో భారీగా ట్రాఫిక్ సమస్యలు తలెత్తడంతో తాను మియాపూర్ నుంచి ఎల్బీనగర్ వరకు మెట్రోలో ప్రయాణించాల్సి వచ్చిందని తెలిపారు.
Similar News
News September 14, 2025
YCP అవినీతిపాలనకు బాబు, మోదీ చరమగీతం: నడ్డా

AP: వైసీపీ హయాంలో ఏపీలో అవినీతి రాజ్యమేలిందని BJP జాతీయాధ్యక్షుడు, కేంద్ర మంత్రి జేపీ నడ్డా ఆరోపించారు. YCP అవినీతిపాలనకు చంద్రబాబు, మోదీ చరమగీతం పాడారన్నారు. విశాఖలో ‘సారథ్యం’ సభలో ఆయన మాట్లాడారు. ‘2014కు ముందు దేశంలో ప్రజలను మభ్యపెట్టే మేనిఫెస్టోలు తీసుకువచ్చి అధికారంలోకి వచ్చేవారు. దేశంలో అసమర్థ, వారసత్వ రాజకీయాలు ఉండేవి. 2014 తర్వాతే దేశంలో మార్పులు వచ్చాయి’ అని ఆయన వ్యాఖ్యానించారు.
News September 14, 2025
HYD: ‘BRS విష ప్రచారాలను తిప్పి కొట్టాలి’

గ్రూప్-1 పరీక్షపై BRS చేస్తున్న విష ప్రచారాలను ప్రతీ కాంగ్రెస్ కార్యకర్తల తిప్పికొట్టాలని రాష్ట గ్రంథాలయ ఛైర్మన్ రియాజ్ పిలుపునిచ్చారు. హైకోర్ట్ తీర్పును తాము ఎల్లప్పుడూ గౌరవిస్తామని స్పష్టంచేశారు. గ్రూప్-1 పోస్టులు అమ్ముకున్నారని మాట్లాడిన KTRపై చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులను కోరారు. అసత్య ప్రచారాలు మానుకోవాలని BRS నాయకులకు హితవు పలికారు.
News September 14, 2025
నేను శివ భక్తుడిని.. విమర్శల విషాన్ని దిగమింగుతా: మోదీ

తనపై వచ్చే విమర్శలపై ప్రధాని మోదీ అస్సాం పర్యటనలో కీలక వ్యాఖ్యలు చేశారు. ‘నాపై విమర్శలకు కాంగ్రెస్ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. నేను శివ భక్తుడిని.. విమర్శల విషాన్ని దిగమింగుతా. అస్సాం పుత్రుడు, భారతరత్న అవార్డు గ్రహీత భూపేన్ హజారికాను కాంగ్రెస్ అవమానించింది. 1962లో చైనా చొరబాటు సమయంలో నెహ్రూ ప్రభుత్వం అనేక తప్పిదాలు చేసింది. వాటిని అస్సాం ప్రజలు ఇప్పటికీ అనుభవిస్తున్నారు’ అని వ్యాఖ్యానించారు.