News September 14, 2025

మినరల్ వాటర్ తాగిన వారికీ డయేరియా.. కారణం ఇదే!

image

విజయవాడలోని అజిత్ సింగ్ నగర్ పరిధిలోని డయేరియా కేసుల వ్యాప్తి నేపథ్యంలో పలు RO ప్లాంట్లను అధికారులు పరిశీలించారు. నీటిలో ఉండే ప్రమాదకర బ్యాక్టీరియాను తొలగించే UV LAMP అనేక చోట్ల లేదని గుర్తించారు. దీని విలువ రూ. 25 వేల వరకు ఉంటుందట. దీంతో అంత ఖర్చు మనకెందుకు అన్నట్లు RO ప్లాంట్ల నిర్వాహకులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో నీటిలో బ్యాక్టీరియా ప్రబలి డయేరియా బారిన పడ్డట్లు ప్రజలు అంటున్నారు.

Similar News

News September 14, 2025

రోజా.. నువ్వు జబర్దస్త్‌ చేయలేదా?: దుర్గేశ్

image

AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను విమర్శించే స్థాయి వైసీపీ నేత రోజాకు లేదని మంత్రి కందుల దుర్గేశ్ ఫైర్ అయ్యారు. నువ్వు మంత్రిగా ఉండి కూడా జబర్దస్త్‌లో పాల్గొనలేదా అని ఆయన ప్రశ్నించారు. ‘పవన్‌కు డబ్బు యావ లేదు. సినిమాల ద్వారా వచ్చిన డబ్బును కూడా ఆయన ప్రజలకే ఖర్చు చేస్తున్నారు. మీరు మంత్రిగా ఉన్నప్పుడు ఒక్క ప్రాజెక్ట్ అయినా రాష్ట్రానికి తీసుకువచ్చారా. ప్రజా సమస్యలు తీర్చారా?’ అని ఆయన మండిపడ్డారు.

News September 14, 2025

నరసరావుపేట: ‘మీకోసం కాల్ సెంటర్ సేవలను వినియోగించుకోండి’

image

ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన ‘మీకోసం’ కాల్ సెంటర్ సేవలను ఉపయోగించుకోవాలని కలెక్టర్ కృతికా శుక్లా ప్రజలకు సూచించారు. సెప్టెంబర్ 15న కలెక్టరేట్‌లో జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదికకు హాజరై మీ సమస్యలను తెలియజేయవచ్చని ఆమె తెలిపారు. అర్జీదారులు తమ ఫిర్యాదులను meekosam.ap.gov.inలో నమోదు చేసుకోవచ్చని, లేదా 1100 నంబర్‌కు కాల్ చేసి వివరాలు తెలుసుకోవచ్చని కలెక్టర్ పేర్కొన్నారు.

News September 14, 2025

రాజోలి: కరెంట్ షాక్‌తో యువకుడి మృతి

image

రాజోలి మండల కేంద్రానికి చెందిన సుజాత సోమేశ్వర్ రెడ్డి కుమారుడైన శివారెడ్డి (25) వరి పొలంలో ఉన్న బోరు మోటర్ ఆన్ చేయడానికి వెళ్లి కరెంట్ షాక్‌తో ఆదివారం మృతి చెందాడు. పొలం పక్కన ఉన్న యువకుడు చూసి కుటుంబ సభ్యులకు సమాచారం అందించాడు. వెంటనే స్థానిక పిహెచ్సి కేంద్రానికి వెళ్లగా సీపీఆర్ చేసిన ప్రయోజనం లేకుండా పోయింది. శివారెడ్డికి ఇటీవలే కొడుకు పుట్టాడు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.