News September 14, 2025

ఆ రైలు నరసాపురం వరకు పొడిగించండి: RRR

image

చెన్నై-విజయవాడ వందేభారత్ రైలు నరసాపురం వరకు పొడిగించాలని శాసనసభ ఉపసభాపతి రఘురామ కేంద్ర రైల్వే కమిటీకి తాజాగా లేఖ రాశారు. భీమవరం మీదుగా నరసాపురం వరకు ఈ రైలు పొడిగిస్తే ప్రయోజనకరంగా ఉంటుందని ఆయన లేఖలో పేర్కొన్నారు. తన విజ్ఞప్తికి అనకాపల్లి ఎంపీ, రైల్వే కమిటీ ఛైర్మన్ సీఎం రమేశ్ సానుకూలంగా స్పందించారని రఘురామ వెల్లడించారు.

Similar News

News September 14, 2025

Gen-Z పాపులేషన్ ఏ రాష్ట్రంలో ఎక్కువంటే?

image

Gen-Z యువత(1997-2012 మధ్య పుట్టినవారు) తలచుకుంటే ప్రభుత్వాలే కూలుతాయనడానికి నేపాల్ ఆందోళనలే నిదర్శనం. మన దేశంలో Gen-Z పాపులేషన్ 27.1% ఉందని ‘India in Pixels’ రిపోర్ట్ తెలిపింది. అత్యధికంగా బిహార్‌లో 32.5%, ఆ తర్వాత J&Kలో 30.8%, ఝార్ఖండ్ 30.7%, UP 30%, రాజస్థాన్ 29.2%, నార్త్‌ఈస్ట్‌లో 29.2% యువత ఉన్నారంది. ఇక TGలో 24.8%, కర్ణాటక 24.1%, AP 23.5%, TN 22%, కేరళలో 21.8% Gen-Zలు ఉన్నట్లు పేర్కొంది.

News September 14, 2025

మొక్కలు నాటడంలో సింగరేణి సీఎండీ బలరాం రికార్డ్

image

తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు 20వేలకు పైగా మొక్కలు నాటిన తొలి సివిల్ సర్వీసెస్ ఆఫీసర్‌గా సింగరేణి సీఎండీ బలరాం రికార్డ్ సృష్టించారు. భూపాలపల్లిలోని మిలీనియం క్వార్టర్స్ వెనక ఉన్న మైదానంలో ఆదివారం సింగరేణి ఆధ్వర్యంలో వన మహోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావుతో కలిసి బలరాం పాల్గొని 370 మొక్కలు నాటి రికార్డ్ సృష్టించారు.

News September 14, 2025

రోజా.. నువ్వు జబర్దస్త్‌ చేయలేదా?: దుర్గేశ్

image

AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను విమర్శించే స్థాయి వైసీపీ నేత రోజాకు లేదని మంత్రి కందుల దుర్గేశ్ ఫైర్ అయ్యారు. నువ్వు మంత్రిగా ఉండి కూడా జబర్దస్త్‌లో పాల్గొనలేదా అని ఆయన ప్రశ్నించారు. ‘పవన్‌కు డబ్బు యావ లేదు. సినిమాల ద్వారా వచ్చిన డబ్బును కూడా ఆయన ప్రజలకే ఖర్చు చేస్తున్నారు. మీరు మంత్రిగా ఉన్నప్పుడు ఒక్క ప్రాజెక్ట్ అయినా రాష్ట్రానికి తీసుకువచ్చారా. ప్రజా సమస్యలు తీర్చారా?’ అని ఆయన మండిపడ్డారు.