News September 14, 2025

జనగామ: రైలులో నుంచి జారిపడి గుర్తుతెలియని వ్యక్తి మృతి

image

జనగామ రైల్వే స్టేషన్‌లో ఆదివారం రైలు నుంచి జారిపడి ఓ వ్యక్తి మృతి చెందాడు. రైల్వే పోలీసుల వివరాల ప్రకారం.. సికింద్రాబాద్ వైపు వెళ్లే ఎగువ లైన్‌లో రైలు నుంచి జారిపడి ఓ వ్యక్తి తీవ్ర గాయాలతో మృతి చెందాడు. మృతదేహాన్ని జనగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడి చాతి పై గౌరీ అనే పచ్చబొట్టు ఉందని, మృతుడికి సంబంధించిన వివరాలు తెలిస్తే 9247800433 రైల్వే పోలీసులకు సమాచారం అందించాలన్నారు.

Similar News

News September 14, 2025

పార్లమెంటులో నెల్లూరు MP పని తీరు ఇదే.!

image

2024- 25వ సంవత్సరానికి నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పనితీరును పార్లమెంట్ వర్గాలు వెల్లడించాయి. ఆయన పార్లమెంట్లో ప్రజా సమస్యలపై 73 ప్రశ్నలు సంధించారు. 77.94 శాతం అటెండెన్స్ కల్గి ఉన్నారు. నాలుగు చర్చా కార్యక్రమాలలో పాల్గొని ప్రజావాణి వినిపించినట్లు పార్లమెంట్ వర్గాలు నివేదికను వెల్లడించాయి.

News September 14, 2025

లోక్‌సభ ర్యాంకిగ్స్‌లో హిందూపురం MPకి 20వ ర్యాంక్

image

లోక్‌సభలో MPల పెర్ఫామెన్స్‌ రిపోర్ట్‌ను పార్లమెంట్ ఆదివారం విడుదల చేసింది. 2024 జూన్ 24 నుంచి 2025 ఏప్రిల్ 4వ తేదీ వరకు MPలు పాల్గొన్న డిబెట్‌లు, అడిగిన క్వశ్చన్స్, అటెండెన్స్ ఆధారంగా ఈ ర్యాంక్‌లు ఇచ్చింది. ఈ నివేదిక ప్రకారం హిందూపురం MP పార్థసారథి 20వ స్థానంలో నిలిచారు. ఆయన లోక్‌సభలో మొత్తం 72 ప్రశ్నలు అడిగారు. 1 చర్చలో పాల్గొన్నారు. కాగా ఆయన హాజరు 69.12శాతం గా ఉంది. ఈయన పనితీరుపై మీ కామెంట్..!

News September 14, 2025

అదాలత్‌లో 10,321 కేసులు పరిష్కారం: వరంగల్ సీపీ

image

జాతీయ లోక్ అదాలత్‌కు విశేష స్పందన లభించిందని, వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మొత్తం 10,321 కేసులు పరిష్కారమయ్యాయని సీపీ సన్ ప్రీత్ సింగ్ తెలిపారు. ఇందులో ఎఫ్‌ఐఆర్ కేసులు, డ్రంకన్&డ్రైవ్, మోటార్ వాహన చట్టం, సైబర్ కేసులు వంటివి ఉన్నాయని ఆయన వివరించారు. ఈ అదాలత్ విజయవంతం కావడంలో కృషి చేసిన సిబ్బందిని ఆయన అభినందించారు.