News September 14, 2025
HYD: భార్య గొంతుకోసిన భర్త.. ఆస్పత్రికి తరలింపు

నాగోల్లో భార్య మహాలక్ష్మి గొంతును భర్త వేణుగోపాల్ కత్తితో కోశాడు. దీంతో ఆమెను పోలీసులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఏడాది క్రితం మహాలక్ష్మితో వివాహం జరగగా.. అదనపు కట్నం కోసం వేధిస్తున్నట్లు తెలుస్తోంది. పెద్దల సమక్షంలో కౌన్సిలింగ్ ఇచ్చిన అతడు మారకపోగా.. ఈరోజు ఘాతుకానికి ఒడిగట్టాడు. కాగా, వేణుగోపాల్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News September 14, 2025
అటవీ ప్రాంతంలో నాలుగు మృతదేహాలు..?

పాకాల(M) సమీపంలోని అటవీ ప్రాంతంలో రెండు మృతదేహాలను పోలీసులు ఆదివారం గుర్తించారు. ఓ వ్యక్తి మృతదేహం చెట్టుకు వేళాడుతుండగా, మరో మహళ డెడ్ బాడీ నేలపై ఉంది. అవి గుర్తు పట్టలేనంతగా మారినట్లు పోలీసులు తెలిపారు. అక్కడే మరో రెండు గుంతలు తవ్వి, వాటిపై బండరాళ్లను ఉంచారు. ఆ గోతిలో చిన్న పిల్లల మృతదేహాలు ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
News September 14, 2025
కాంగ్రెస్ వల్లే విద్యాసంస్థలు మూతపడే పరిస్థితి: హరీశ్ రావు

TG: రెండేళ్లుగా ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు విడుదల చేయకపోవడం సిగ్గుచేటని BRS MLA హరీశ్ రావు ఫైరయ్యారు. కాంగ్రెస్ నిర్లక్ష్యంతో విద్యాసంస్థలు మూతపడే పరిస్థితి నెలకొందన్నారు. రీయింబర్స్మెంట్, ఉద్యోగులకు జీతాలు చెల్లించకుండా ప్రాజెక్టులకు ₹కోట్ల టెండర్లు ఎలా పిలుస్తున్నారని ప్రశ్నించారు. ఇలానే కొనసాగితే తక్కువ కాలంలో విద్యావ్యవస్థను భ్రష్టు పట్టించిన విద్యాశాఖ మంత్రిగానూ రేవంత్ నిలిచిపోతారన్నారు.
News September 14, 2025
ఖమ్మం: వ్యభిచార గృహంపై దాడి.. కేసు నమోదు

బోనకల్ మండలంలోని చిరునోముల గ్రామంలో వ్యభిచార గృహంపై పోలీసులు దాడి చేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్, ఎస్ఐ పొదిలి వెంకన్న ఆధ్వర్యంలో ఈ దాడి జరిగింది. ఈ దాడిలో ఓ విటుడు, ఓ మహిళ, నిర్వాహకురాలు మంగమ్మను పట్టుకున్నట్లు ఎస్ఐ తెలిపారు. వీరిపై కేసు నమోదు చేసి తదుపరి చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు.