News September 14, 2025

తిరుమలలో 15న సిఫార్సు లేఖలు రద్దు

image

తిరుమలలో శ్రీ వేంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ఈనెల 16న కోయిల్ ఆళ్వార్ తిరుమంజన ఉత్సవం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా అష్టాదళ పాద పద్మారాధన సేవను టీటీడీ రద్దు చేసింది. 16న ప్రోటోకాల్ ప్రకారం ప్రముఖులకు తప్ప మిగతా వీఐపీలకు బ్రేక్ దర్శనాలు నిలిపివేసింది. 15న సిఫార్సు లేఖల ద్వారా దర్శనాలను సైతం రద్దు చేసినట్లు పేర్కొంది. భక్తులు సహకరించాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది.

Similar News

News September 14, 2025

ఆస్ట్రేలియా చేతిలో భారత మహిళల జట్టు ఓటమి

image

ఆస్ట్రేలియాతో 3 వన్డేల సిరీస్‌లో భాగంగా ఇవాళ జరిగిన తొలి మ్యాచులో భారత్ ఓడిపోయింది. తొలుత భారత మహిళల జట్టు 281/7 రన్స్ చేసింది. ప్రతిక (64), స్మృతి (58), హర్లీన్ (54) రాణించారు. అనంతరం బ్యాటింగ్ చేసిన ఆసీస్ 44.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. లిచ్‌ఫీల్డ్ 88 పరుగులతో జట్టును ముందుండి నడిపించారు. మూనీ 77 రన్స్‌తో రాణించారు.

News September 14, 2025

మునుగోడు: యువతి సూసైడ్

image

తల్లి మందలించిందని మనస్తాపానికి గురైన యువతి పురుగుల మందు తాగి సూసైడ్ చేసుకుంది. ఎస్ఐ రవి తెలిపిన వివరాల ప్రకారం.. వ్యవసాయ పనులకు వెళ్లాలని తల్లి మందలించగా మునుగోడు మండలం చెల్మెడకు చెందిన భవాని (25) పురుగుల మందు తాగింది. చికిత్స కోసం నల్గొండలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది.

News September 14, 2025

మంచిర్యాల:అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలి: కలెక్టర్

image

మంచిర్యాల మున్సిపాలిటీలలో చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతం చేసి త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్‌ దీపక్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో మందమర్రి, క్యాతనపల్లి, చెన్నూర్ మున్సిపల్ అధికారులతో జరిగిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజా సంక్షేమ కార్యక్రమాలను కూడా పకడ్బందీగా అమలు చేయాలని సూచించారు.