News September 14, 2025
బాపట్ల ఎంపీకి 05వ ర్యాంక్

2024-25వ సంవత్సరానికి సంబంధించి లోక్సభలో ఆంధ్రప్రదేశ్ MPల పనితీరు నివేదికను పార్లమెంట్ ప్రతినిధులు ఆదివారం విడుదల చేశారు. ఈ నివేదికలో బాపట్ల MP హరికృష్ణ ప్రసాద్ 5వ స్థానంలో నిలిచారు. ఆయన లోక్సభలో మొత్తం 73 ప్రశ్నలు అడిగారు. 14 చర్చల్లో పాల్గొన్నారు. ఆయన హాజరు శాతం 86.76గా ఉంది. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ ర్యాంకును కేటాయించినట్లు పార్లమెంట్ వర్గాలు వెల్లడించాయి. ఆయన పనితీరుపై మీ కామెంట్..!
Similar News
News September 14, 2025
యాదాద్రిలో మంత్రి జూపల్లి ప్రత్యేక పూజలు

మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదివారం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామివారిని దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం దర్భాలయంలో స్వయంభూ నరసింహుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు అష్టోత్తర పూజ జరిపి, మంత్రికి ఆశీర్వచనం అందజేశారు. ఆలయ అధికారులు ప్రసాదాలను అందజేశారు.
News September 14, 2025
2 కీలక వికెట్లు కోల్పోయిన భారత్

పాకిస్థాన్తో జరుగుతున్న మ్యాచులో టీమ్ ఇండియా ఓపెనర్లు ఔటయ్యారు. గిల్ 10 రన్స్ చేసి స్టంపౌట్ అయ్యారు. అభిషేక్ శర్మ 2 సిక్సర్లు, 4 ఫోర్లతో రఫ్పాడించారు. అదే జోరులో మరో భారీ షాట్కు ప్రయత్నించి బౌండరీ దగ్గర క్యాచ్ ఇచ్చారు. ప్రస్తుతం భారత్ స్కోర్ 4 ఓవర్లలో 42/2గా ఉంది. సూర్య సేన విజయానికి మరో 86 పరుగులు అవసరం.
News September 14, 2025
మక్తల్: ఉపాధ్యాయుల మానసిక ఉల్లాసానికి క్రీడల అవసరం: DYSO

ఉపాధ్యాయుల మానసిక ఉల్లాసానికి క్రీడలు ఎంతో అవసరమని DYSO శెట్టి వెంకటేష్ అన్నారు. మక్తల్ పట్టణంలో మినీ స్టేడియంలో ఆదివారం నియోజకవర్గస్థాయి ఉపాధ్యాయుల క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. ఈ టోర్నమెంట్లో కృష్ణ, మాగనూర్, నర్వ, మక్తల్, ఊట్కూర్ మండలాల ఉపాధ్యాయులు మ్యాచ్లో పాల్గొన్నారు. ఫైనల్లో ఊట్కూరు ఉపాధ్యాయులు మ్యాచ్లో విజయం సాధించినట్లు నిర్వాహకులు తెలిపారు.