News September 14, 2025
పిట్లం: నవ మాసాలు మోసినందుకు దక్కిన బహుమతి ఇదేనా?

పిట్లం మండలం బొల్లక్ పల్లి మంజీరా బ్రిడ్జి వద్ద ఈ నెల 11న మహిళ మృతదేహం లభ్యమైన విషయం తెలిసిందే. బాన్సువాడ DSP విఠల్ రెడ్డి వివరాలు.. బోర్లం గ్రామానికి చెందిన సాయవ్వ(77) ఆరోగ్యం బాగ లేక మంచాన పడటంతో ఆమె కుమారుడు బాలయ్య స్నేహితుడితో కలిసి ఈ నెల 8న రాత్రి మంజీరాలోకి తోసి హత్య చేసినట్లు విచారణలో ఒప్పుకున్నాడు. నిందితులిద్దరిని ఆదివారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు DSP వెల్లడించారు.
Similar News
News September 15, 2025
BREAKING: పాకిస్థాన్పై భారత్ ఘన విజయం

ASIA CUP-2025: పాకిస్థాన్ను భారత్ చిత్తు చేసింది. 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత పాకిస్థాన్ 127/9 పరుగులు చేసింది. అనంతరం భారత్ వేగంగా ఆడి 15.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. ఓపెనర్ అభిషేక్ శర్మ (13 బంతుల్లో 31), సూర్యకుమార్ యాదవ్ 47*, తిలక్ వర్మ 31 రాణించారు. భారత్ తన తర్వాతి మ్యాచ్ ఈ నెల 19న ఒమన్తో ఆడనుంది.
News September 15, 2025
HYDలో విషాదం నింపిన వర్షం.. ముగ్గురి గల్లంతు

నగరంలో ఆదివారం కురిసిన కుండపోత వర్షంలో ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. హబీబ్నగర్లో మామ రామ, అల్లుడు అర్జున్ వరదల్లో కొట్టుకుపోయారు. మామను కాపాడబోయి అల్లుడు కూడా గల్లంతయ్యాడు. ఇక ముషీరాబాద్ వినోదనగర్లో యువకుడు సన్నీ నాలాలో పడిపోయాడు. విషయం తెలుసుకున్న వెంటనే ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు, GHMC, HYDRA బృందాలు గాలింపు చర్యలను ప్రారంభించాయి. ప్రమాదాలు జరిగిన ప్రాంతాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.
News September 15, 2025
HYDలో విషాదం నింపిన వర్షం.. ముగ్గురి గల్లంతు

నగరంలో ఆదివారం కురిసిన కుండపోత వర్షంలో ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. హబీబ్నగర్లో మామ రామ, అల్లుడు అర్జున్ వరదల్లో కొట్టుకుపోయారు. మామను కాపాడబోయి అల్లుడు కూడా గల్లంతయ్యాడు. ఇక ముషీరాబాద్ వినోదనగర్లో యువకుడు సన్నీ నాలాలో పడిపోయాడు. విషయం తెలుసుకున్న వెంటనే ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు, GHMC, HYDRA బృందాలు గాలింపు చర్యలను ప్రారంభించాయి. ప్రమాదాలు జరిగిన ప్రాంతాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.