News April 4, 2024

శంకరపట్నం: జాతీయ రహదారిపై యాక్సిడెంట్.. వ్యక్తి మృతి

image

శంకరపట్నం జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. మండల పరిధిలోని చింతకుంటకు చెందిన సిరిసిల్ల ఆంజనేయులు, మంద హరీష్ బైకు పై వెళ్తున్నారు. ఈక్రమంలో కేశవపట్నం బస్టాండ్ ఎదురుగా బైకు అదుపుతప్పి పడటంతో కరీంనగర్ నుంచి వరంగల్ వెళ్తున్న RTC బస్సు కిందపడి ఆంజనేయులు అక్కడికక్కడే మృతి చెందాడు. కేశవపట్నం ఎస్సై లక్ష్మారెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News October 26, 2025

కరీంనగర్: రేపటి ప్రజావాణి రద్దు.. ఎందుకంటే..?

image

కరీంనగర్ కలెక్టరేట్‌లో ప్రతి సోమవారం జరిగే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజావాణి నిర్వహించే ఆడిటోరియంలో మద్యం దుకాణాల టెండర్‌కు సంబంధించిన లాటరీ కార్యక్రమం ఏర్పాటు చేసినందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు. జిల్లా ప్రజలు ఈ అంతరాయాన్ని గమనించి సహకరించాలని ఆమె కోరారు.

News October 26, 2025

కరీంనగర్ మహాసభకు ‘తరలిన శ్రీనివాసులు’

image

చొప్పదండి మండలం నుంచి శ్రీనివాస నామదేయ మిత్రులు ఆదివారం పెద్దసంఖ్యలో KNRలో జరుగుతున్న తెలంగాణ శ్రీనివాసుల సేవా సంస్థ వార్షికోత్సవ మహాసభకు తరలివెళ్లారు. కాగా, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ప్రతినిధులు ఈ సభకు వస్తుండడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. వార్షికోత్సవ మహాసభ సందర్భంగా తలసేమియా బాధితులకు రక్తదాన కార్యక్రమం చేపట్టారు. అనంతరం భవిష్యత్ కార్యక్రమాలకు రూపకల్పన చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

News October 25, 2025

KNR: పోలీస్ ట్రైనింగ్ కళాశాలలో రక్తదాన శిబిరం

image

పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలను పురస్కరించుకొని, కరీంనగర్ పోలీస్ ట్రైనింగ్ కళాశాల (పీటీసీ)లో “GIVE BLOOD – SAVE LIFE” నినాదంతో భారీ రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. సమాజం కోసం ప్రాణాలర్పించిన పోలీసు అమరవీరులను స్మరించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. పీటీసీలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేసిన కళాశాల అధికారులను సీపీ అభినందించారు.