News September 14, 2025

అటవీ ప్రాంతంలో నాలుగు మృతదేహాలు..?

image

పాకాల(M) సమీపంలోని అటవీ ప్రాంతంలో రెండు మృతదేహాలను పోలీసులు ఆదివారం గుర్తించారు. ఓ వ్యక్తి మృతదేహం చెట్టుకు వేళాడుతుండగా, మరో మహళ డెడ్ బాడీ నేలపై ఉంది. అవి గుర్తు పట్టలేనంతగా మారినట్లు పోలీసులు తెలిపారు. అక్కడే మరో రెండు గుంతలు తవ్వి, వాటిపై బండరాళ్లను ఉంచారు. ఆ గోతిలో చిన్న పిల్లల మృతదేహాలు ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Similar News

News September 15, 2025

మరోసారి ప్రతీకారం తీర్చుకున్నాం: నెటిజన్స్

image

ఆసియా కప్‌లో భాగంగా జరిగిన మ్యాచ్‌లో పాక్‌ను భారత్ చిత్తు చేసింది. మొదట పాక్‌తో మ్యాచ్ ఆడకూడదనే డిమాండ్ చేశారు. కానీ పోరు నుంచి తప్పుకోవడం కంటే పోరాడి మట్టి కరిపించడం మేలని అభిప్రాయపడిన వాళ్లూ ఉన్నారు. పహల్గామ్ ఉగ్రదాడికి సమాధానంగా OP సిందూర్‌తో ఒకసారి, మైదానంలో ఇవాళ మరోసారి పాక్‌పై ప్రతీకారం తీర్చుకున్నామని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. వేదిక ఏదైనా దాయాదికి బుద్ధి చెప్పాల్సిందే అంటున్నారు.

News September 15, 2025

BREAKING: పాకిస్థాన్‌పై భారత్ ఘన విజయం

image

ASIA CUP-2025: పాకిస్థాన్‌ను భారత్ చిత్తు చేసింది. 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత పాకిస్థాన్ 127/9 పరుగులు చేసింది. అనంతరం భారత్ వేగంగా ఆడి 15.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. ఓపెనర్ అభిషేక్ శర్మ (13 బంతుల్లో 31), సూర్యకుమార్ యాదవ్ 47*, తిలక్ వర్మ 31 రాణించారు. భారత్ తన తర్వాతి మ్యాచ్ ఈ నెల 19న ఒమన్‌తో ఆడనుంది.

News September 15, 2025

HYDలో విషాదం నింపిన వర్షం.. ముగ్గురి గల్లంతు

image

నగరంలో ఆదివారం కురిసిన కుండపోత వర్షంలో ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. హబీబ్‌నగర్‌లో మామ రామ, అల్లుడు అర్జున్ వరదల్లో కొట్టుకుపోయారు. మామను కాపాడబోయి అల్లుడు కూడా గల్లంతయ్యాడు. ఇక ముషీరాబాద్ వినోదనగర్‌లో యువకుడు సన్నీ నాలాలో పడిపోయాడు. విషయం తెలుసుకున్న వెంటనే ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు, GHMC, HYDRA బృందాలు గాలింపు చర్యలను ప్రారంభించాయి. ప్రమాదాలు జరిగిన ప్రాంతాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.