News September 15, 2025
పోచారం ప్రాజెక్టులో నీట మునిగి యువకుడి మృతి

నాగిరెడ్డిపేట్(M) పోచారం ప్రాజెక్టులో నీట మునిగి ఓ యువకుడు మృతి చెందిన ఘటన ఆదివారం సాయంత్రం చోటు చేసుకుంది. ఎస్సై భార్గవ్ గౌడ్ వివరాలు.. మెదక్కు చెందిన షేక్ మహబూబ్(20) తన స్నేహితునితో కలిసి ప్రాజెక్టు దిగువన ఈత కొట్టేందుకు నీటిలో దిగారు. లోతు ఎక్కువగా ఉండటంతో షేక్ మహబూబ్ నీట మునిగిపోయాడు. పోలీసులు చేరుకొని గజ ఈతగాళ్లతో మృతదేహాన్ని బయటకు తీశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Similar News
News September 15, 2025
కాంగ్రెస్తో పొత్తుకు తేజస్వీ బ్రేక్!

జాతీయ స్థాయిలో కూటమిగా ఉంటూ రాష్ట్ర ఎన్నికల్లో వేరుగా పోటీ చేసేందుకు ఇండీ కూటమి పార్టీలు మొగ్గు చూపుతున్నాయి. బిహార్లో ఉన్న 243 స్థానాల్లోనూ పోటీ చేస్తామని ఇండీ కూటమిలోని RJD ప్రకటించడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. దీంతో తేజస్వీ కాంగ్రెస్తో పొత్తుకు బ్రేక్ ఇచ్చారా అనే ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. గతంలో పంజాబ్, హరియాణా ఎన్నికల్లో ఆప్, పశ్చిమబెంగాల్లో TMC ఒంటరిగా బరిలోకి దిగిన సంగతి తెలిసిందే.
News September 15, 2025
HYD: గొర్రెల స్కామ్ కేసు.. ED ముందుకు ఏపీ రైతులు

గొర్రెల స్కామ్ కేసులో ఈడీ స్పీడ్ పెంచింది. నేడే విచారణకు రావాలంటూ బాధితులకు నోటీసులు జారీ చేసింది. గొర్రెల స్కామ్లో మోసపోయామంటూ ఏపీకి చెందిన గొర్రెల కాపర్లు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. బాధితుల ఫిర్యాదు మేరకు ఈ నెల 15న విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు జారీ చేసింది. ఇప్పటికే ఈ కేసులో ఏసీబీ దర్యాప్తు కొనసాగుతుండగా.. ఏసీబీ విచారణ ఆధారంగా ED ఎంటరైంది.
News September 15, 2025
ఇద్దరు పల్నాడు జిల్లా సీఐలపై సస్పెన్షన్ వేటు

గతంలో పల్నాడు జిల్లాలో పని చేసిన ఇద్దరు CI లపై సస్పెన్షన్ వేటు పడింది. 2022 జూన్ 3వ తేదీన దుర్గి (M) జంగమేశ్వరపాడుకు చెందిన TDP నేత జల్లయ్య హత్య కేసులో నిందితులను వదిలేసి అతడి బంధువులను నిందితులుగా పేర్కొంటూ కేసు నమోదు చేశారని ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కూటమి సర్కారు విచారణకు ఆదేశించింది. అప్పట్లో మాచర్ల రూరల్ CI షమీముల్లా, కారంపూడి జయకుమార్ కేసు తారుమారు చేశారని ఇద్దరిని సస్పెండ్ చేశారు.