News September 15, 2025
సీఎం కాన్ఫరెన్స్కు హాజరైన కాకినాడ కలెక్టర్

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం నుంచి నిర్వహిస్తున్న రెండు రోజుల కలెక్టర్ల సమావేశానికి కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్మోహన్ హాజరయ్యారు. ముఖ్యమంత్రి ప్రసంగం తర్వాత జిల్లాకు సంబంధించిన అంశాలపై ఆయన చర్చిస్తారని అధికారులు తెలిపారు. జిల్లా సమస్యలపై సమగ్ర సమాచారాన్ని కలెక్టర్ తీసుకెళ్లారని, వాటిని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకురానున్నారని సమాచారం.
Similar News
News September 15, 2025
పార్వతీపురం: ఎస్పీ కార్యాలయంలో పీజీఆర్ఎస్కు 10 అర్జీలు

పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం జరిగిన పీజీఆర్ఎస్ కార్యక్రమానికి 10 వినతులు వచ్చినట్లు ఎస్పీ అంకిత సురాణా తెలిపారు. ప్రజల నుంచి స్వీకరించిన అర్జీలను సంబంధిత అధికారులకు పంపించారు. సమస్యల నివేదక ఎస్పీ కార్యాలయానికి అందజేయాలని చెప్పారు.
News September 15, 2025
MHBD: తప్పని గోస.. రైతు వేదిక వద్దకే సద్ది బువ్వ!

మహబూబాబాద్ రైతన్నలకు యూరియా కష్టాలు తప్పట్లేదు. మబ్బులోనే PACS సెంటర్లు, రైతు వేదికలకు చేరుకుంటున్నప్పటికీ టోకెన్లు, యూరియా బస్తాలు దొరక్క అరిగోస పడుతున్నారు. మరిపెడ మండలం తానంచర్లలోని రైతు వేదికలో యూరియా టోకెన్లు ఇస్తారనే సమాచారం అందుకున్న రైతులు తెల్లవారుజామునే అక్కడికి చేరుకున్నారు. గంటల తరబడి లైన్లో నిలబడే పరిస్థితి ఉంటుందని ముందే గ్రహించిన రైతున్న సద్ది పెట్టుకొని వచ్చి అక్కడే భోజనం చేశాడు.
News September 15, 2025
జగిత్యాల: బాధితుల సమస్యల పరిష్కారానికి కృషి: ఎస్పీ

జగిత్యాల జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ డేలో 11 మంది అర్జీదారులతో ఎస్పీ స్వయంగా మాట్లాడి వారి ఫిర్యాదులను స్వీకరించారు. సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఫోన్లో ఆదేశించారు. ప్రతి ఫిర్యాదును ఆన్లైన్లో నమోదు చేసి, నిరంతరం పర్యవేక్షిస్తున్నామని ఎస్పీ తెలిపారు. బాధితులకు త్వరితగతిన న్యాయం జరిగేలా చూస్తామని ఆయన హామీ ఇచ్చారు.