News April 4, 2024

50వేల మెజారిటీతో గెలుస్తా: సత్యకుమార్ యాదవ్

image

ధర్మవరం నియోజకవర్గంలో ఐదేళ్లుగా సాగిన రాక్షస పాలనకు అంతం పలుకుదామని ధర్మవరం కూటమి అభ్యర్థి సత్యకుమార్ యాదవ్ అన్నారు. ఇవాళ ధర్మవరం ఎన్టీఆర్ సర్కిల్‌లో తన బహిరంగ సభకు కదలివచ్చిన ప్రజల్ని చూస్తుంటే.. 50వేల మెజారిటీలో గెలుపు ఖాయంగా కనిపిస్తోందని అన్నారు. ప్రజలు తలుచుకుంటే వైసీపీ పాలన నేలమట్టమవుతుందని చెప్పారు. ధర్మవరంలో వైసీపీ పాలన తొలగి.. ప్రజాపాలన రావాలని సత్యకుమార్ యాదవ్ ఆకాంక్షించారు.

Similar News

News September 10, 2025

రైతులు అధైర్య పడకండి.. యూరియా కొరత లేదు: కలెక్టర్

image

అనంతపురం జిల్లాలో రైతులు ఇబ్బందులు పడకుండా యూరియాను సక్రమంగా అందిస్తున్నట్లు కలెక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. జిల్లాలో వివిధ రైతు సేవా కేంద్రాల్లో 298 మెట్రిక్ టన్నులు, సొసైటీలలో 92, ప్రైవేట్ డీలర్ల వద్ద 448 మెట్రిక్ టన్నులు, హోల్‌సేల్ డీలర్లు & AP Markfed వద్ద 1069 మెట్రిక్ టన్నులు, రవాణా కింది 519 మెట్రిక్ టన్నులు మొత్తంగా జిల్లాలో 2,426 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందన్నారు.

News September 9, 2025

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన షెడ్యూల్ ఇదే

image

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అనంతపూరం పర్యటన షెడ్యూల్ ఖరారైంది. రేపు మధ్యాహ్నం 12:40 గంటలకు పుట్టపర్తి సత్య సాయిబాబా విమానాశ్రయానికి చేరుకుంటారు. అనంతరం అక్కడి నుంచి రోడ్డు మార్గంలో అనంతపురం చేరుకుంటారు. ఇంద్రప్రస్థ మైదానంలో జరిగే ‘సూపర్-6 సూపర్ హిట్’ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు.

News September 9, 2025

అనంత: టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సంగా తేజస్విని కారుపై రాళ్ల దాడి

image

అనంతపురంలో ‘సూపర్ సిక్స్-సూపర్ హిట్’ విజయోత్సవ భారీ బహిరంగ సభను ఘనంగా జరుపుకునేందుకు కూటమి నేతలు ఏర్పాటు చేసుకుంటున్నారు. అయితే తెలుగు మహిళ రాష్ట్ర అధికార ప్రతినిధి సంగా తేజస్విని కారుపై గుర్తుతెలియని వ్యక్తులు రాళ్లతో దాడి చేశారు. స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఆమె తెలిపారు. రాళ్ల దాడిలో దెబ్బతిన్న కారును పోలీసులు పరిశీలించారు.