News September 15, 2025
ములుగు గ్రీవెన్స్లో 71 దరఖాస్తులు

ప్రజావాణి దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని ములుగు అదనపు కలెక్టర్(స్థానిక సంస్థల) సంపత్ రావు వివిధ శాఖల అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో ప్రజావాణి కార్యక్రమంలో ఆయన ప్రజల నుంచి వినతులు స్వేకరించారు. మొత్తం 71 దరఖాస్తులు రాగా.. అందులో 26 రెవిన్యూ, 6 ఇందిరమ్మ ఇళ్లు, 7 పెన్షన్, 6 ఉద్యోగం, 26 ఇతర సమస్యలకు సంబంధించినవి ఉన్నాయి.
Similar News
News September 16, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
News September 16, 2025
ఉత్తరాంధ్రతో పోటీగా సీమ అభివృద్ధి: చంద్రబాబు

AP: అభివృద్ధిలో ఉత్తరాంధ్రతో రాయలసీమ పోటీ పడుతోందని కలెక్టర్ల కాన్ఫరెన్స్లో CM చంద్రబాబు పేర్కొన్నారు. ‘ఉత్తరాంధ్రలో ఆర్సెలార్ మిట్టల్, TCS, గూగుల్ వంటి సంస్థలు వస్తున్నాయి. రాయలసీమలో లేపాక్షి నుంచి ఓర్వకల్లు వరకూ పెద్దఎత్తున పరిశ్రమలు వస్తాయి. శ్రీసిటీతో పాటు తిరుపతి కేంద్రంగానూ పరిశ్రమలు వస్తున్నాయి. పోర్టులు, ఎయిర్ పోర్టులు కూడా వేగంగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకున్నాం’ అని తెలిపారు.
News September 16, 2025
గడ్డెన్న వాగు ప్రాజెక్ట్ పరివాహక ప్రజలకు ALLERT

భైంసాలోని గడ్డెన్న వాగు ప్రాజెక్ట్ పరివాహక ప్రాంతంలో వర్షం కురుస్తున్నందున ప్రాజెక్ట్ వరద గేట్ల నుంచి నీటిని ఏ క్షణమైన విడుదల చేస్తామని ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ సోమవారం రాత్రి ఓ ప్రకటనలో తెలిపారు. నదీ పరివాహక ప్రాంతంలోకి (దిగువకు) పశువులు, గొర్రెలు వెళ్లకుండా రైతులు, గొర్రెకాపరులు జాగ్రత్త వహించాలన్నారు. తగిన సూచనలు చేసే వరకు అప్రమత్తంగా ఉండాలని కోరారు.