News April 4, 2024

MBNR: ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత బదిలీలు చేపట్టాలి

image

తెలంగాణ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ఉద్యోగులకు పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని, పెండింగ్లో ఉన్న మూడు డీఏలను ఎన్నికల కమిషన్ అనుమతితో మంజూరు చేయాలని, ఆర్థిక శాఖలో పెండింగ్లో ఉన్న బిల్లులను మంజూరు చేయాలని కోరారు. ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత సాధారణ బదిలీలను చేపట్టాలని అన్నారు. కార్యక్రమంలో కార్యదర్శి సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.

Similar News

News September 11, 2025

MBNR: యువతకు GOOD NEWS.. అప్లై చేసుకోండి

image

యువత వరల్డ్ స్కిల్ కాంపిటిషన్ -2025లో పాల్గొనుటకు ఈనెల 30లోపు రిజిస్టేషన్ చేసుకోవాలని జిల్లా ఉపాధి కల్పన అధికారిణి మైత్రి ప్రియ Way2Newsతో తెలిపారు. కంప్యూటర్ ట్రేడ్స్‌కు 16-24లోపు ఉండాలని, ఈ పోటీలో జిల్లా, రాష్ట్ర, నేషనల్, ఇంటర్ నేషనల్ స్థాయిలో ఉంటుందన్నారు. ఉమ్మడి జిల్లాలో అర్హత కలిగిన అభ్యర్థులు దాదాపు 56కి పైగా నైపుణ్యాలలో పోటి పడొచ్చన్నారు. Web:https://www.skillindiadigital.gov.in.

News September 11, 2025

MBNR: వాకిటి శ్రీహరికి హోంశాఖ ఇవ్వాలి- శ్రీనివాస్ గౌడ్

image

వాకిటి శ్రీహరికి ప్రాధాన్యంలేని మత్స్యశాఖ కట్టబెట్టి నిధులు ఇవ్వడంలేదని మాజీమంత్రి శ్రీనివాస్ గౌడ్ వ్యాఖ్యానించారు. రెవెన్యూ లేదా హోంశాఖ కేటాయిస్తే బాగా పనిచేస్తారన్నారు. గురువారం HYDలోని తెలంగాణ భవన్‌లో ఆయన మాట్లాడారు. ముదిరాజ్‌లను బీసీ ఏ గ్రూప్‌లో చేరుస్తామని మోసం చేస్తున్నారన్నారు. CM, పీసీసీ ప్రెసిడెంట్ చర్చించి బీసీ డిక్లరేషన్‌లో ఇచ్చిన హామీలకు GO ఇవ్వాలని శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు.

News September 11, 2025

MBNR: పశువుల దొంగల అరెస్టు.. రూ.14.50 లక్షలు స్వాధీనం

image

MBNR(D) నవాబ్‌పేట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో పశువుల దొంగతనాలు చేసిన నలుగురు నిందితులను పట్టుకున్నట్లు జిల్లా ఎస్పీ డి.జానకి తెలిపారు. ఈ నెల 2న కేసు నమోదు అయిందన్నారు. నవాబ్‌పేట్ పోలీసులు కన్మన్ కల్వ గ్రామ శివారులో నేడు పెట్రోలింగ్ చేస్తుండగా.. అనుమానాస్పదంగా తిరుగుతున్న నలుగురు వ్యక్తులను, బొలెరో వాహనం అదుపులోకి తీసుకున్నామన్నారు. రూ.14,50,000 విలువైన ఆస్తిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.