News September 16, 2025
DSC: జిల్లాలో మిగిలిపోయిన 56 పోస్టులు

అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో 807 పోస్టులకు డీఎస్సీ-2025 తుది ఫలితాలు విడుదలయ్యాయి. 775 మంది ధ్రువపత్రాల పరిశీలనకు హాజరవగా, 755 మందిని ఎంపిక చేశారు. ఎంపికైన అభ్యర్థులకు సెప్టెంబర్ 19న అమరావతిలో సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ చేతుల మీదుగా ఉద్యోగ అర్హత పత్రాలు అందించనున్నారు. కొన్ని కేటగిరీలలో అభ్యర్థులు లేక జిల్లాలో 56 పోస్టులు మిగిలాయి.
Similar News
News September 16, 2025
సిద్ధిపేట: ‘కేసులను త్వరగా ఇన్వెస్టిగేషన్ పూర్తి చేయాలి’

SC, ST కేసులలో త్వరగా ఇన్వెస్టిగేషన్ పూర్తి చేయాలని సీపీ కమిషనర్ అనురాధ ACPకి సూచించారు. మంగళవారం ఏసీపీ ఆఫీసును సీపీ సందర్శించి రికార్డ్స్, క్రైమ్ ఫైల్స్ తనిఖీ చేశారు. పెండింగ్లో ఉన్న OE త్వరగా పూర్తి చేయాలని అన్నారు. ఏసీపీ రవీందర్ రెడ్డి టూ టౌన్ ఇన్స్పెక్టర్ ఉపేందర్ ఎస్బీ ఇన్స్పెక్టర్ కిరణ్, ఐటీ కోర్ ఇన్స్పెక్టర్ శ్రీధర్ గౌడ్, సీసీఆర్పీ ఇన్స్పెక్టర్ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
News September 16, 2025
మాడ్యులర్ కిచెన్ చేయిస్తున్నారా?

మాడ్యులర్ కిచెన్కు ఈ రోజుల్లో ఆదరణ పెరుగుతోంది. అయితే కిచెన్కి వెంటిలేషన్ బాగా ఉండేలా చూసుకోవాలి. సరకులు పెట్టుకోవడానికి అల్మారా, డీప్ డ్రా నిర్మించుకోవాలి. చాకులు, స్పూన్లు, గరిటెలు విడివిడిగా పెట్టుకొనేలా ఉండాలి. అప్పుడే వస్తువులు నీట్గా కనిపిస్తాయి. కావాల్సిన వస్తువు వెంటనే చేతికి దొరుకుతుంది. వంటగదిలో ఎలక్ట్రానిక్ పరికరాలు వాడటానికి వీలుగా అవసరమైన చోట ప్లగ్ బోర్డ్స్ ఉండేలా చూసుకోవాలి.
News September 16, 2025
దేవీ నవరాత్రులు ఘనంగా నిర్వహించాలి: రమేశ్ బాబు

కాకినాడ జిల్లాలోని దేవాలయాల కార్యనిర్వహణాధికారులతో దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ రమేశ్ బాబు సమావేశమయ్యారు. కాకినాడ బాలాత్రిపురసుందరి ఆలయంలో జరిగిన ఈ సమావేశంలో దేవీ నవరాత్రుల ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని సూచించారు. విజయవాడ, ఇతర ఆలయాలకు డిప్యూటేషన్పై వెళ్లేవారు ఒక రోజు ముందుగా రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. ఆలయ నిధుల లావాదేవీలపై చర్చించారు.