News April 4, 2024

రాత్రి సమయంలో మరింత గస్తీ: తూ.గో ఎస్పీ

image

ఎన్నికల నేపథ్యంలో తూర్పు గోదావరి జిల్లాలో చట్టవ్యతిరేక కార్యకలాపాలు జరగకుండా పోలీస్ స్టేషన్స్ పరిధిలో రాత్రి వేళ మరింత గస్తీని పెంచుతున్నట్లు ఎస్పీ జగదీష్ తెలిపారు. ఆదేశాలను ఎవరైనా పట్టించుకోకుంటే వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామన్నారు. విధుల్లో భాగంగా ఈరోజు పలు ప్రాంతాల్లో సిబ్బందితో కలిసి తనిఖీలు నిర్వహించారు. ఆయా స్టేషన్స్ పరిధిలో నిందితులుగా ఉన్న రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చినట్లు తెలిపారు.

Similar News

News January 2, 2026

జిల్లాలో విస్తారంగా పొగాకు సాగు!

image

గత సీజన్‌లో లాభాలు పండటంతో జిల్లాలో వర్జీనియా పొగాకు సాగు జోరుగా సాగుతోంది. గోపాలపురం వేలం కేంద్రం పరిధిలో 3,020 హెక్టార్లు, దేవరపల్లి పరిధిలో 4,566 హెక్టార్లలో రైతులు నాట్లు వేశారు. రెండు కేంద్రాల పరిధిలో సుమారు 3,461 మంది రైతులు 4,039 బ్యారెన్ల ద్వారా సాగు చేస్తున్నారు. మొత్తం సాగులో 30 శాతానికి పైగా వర్జీనియా పొగాకు ఇక్కడే ఉండటం విశేషం.

News January 2, 2026

వంతెనపై బైక్.. గోదావరిలో శవమై తేలిన వేములూరు వాసి!

image

ఐదు రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠ విషాదాంతమైంది. కొవ్వూరు మండలం వేములూరుకు చెందిన గేల్లా గోవిందప్రసాద్(38) మృతదేహం గోదావరి నదిలో లభ్యమైంది. డిసెంబరు 30న ఇంటి నుంచి వెళ్లిన ఆయన.. తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 31న రోడ్డు కం రైలు వంతెనపై బైకును గుర్తించిన పోలీసులు గాలింపు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి, పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

News January 2, 2026

తూర్పు గోదావరిలో వరి సేకరణ వేగవంతం: జేసీ

image

తూర్పు గోదావరి జిల్లాలో ఖరీఫ్ వరి సేకరణ ప్రక్రియ విజయవంతంగా సాగుతోందని జేసీ వై. మేఘా స్వరూప్ గురువారం తెలిపారు. జనవరి 1, 2026 నాటికి పీపీసీల ద్వారా 3.67 లక్షల మెట్రిక్ టన్నుల వరిని సేకరించినట్లు వెల్లడించారు. ఇప్పటివరకు 47,426 మంది రైతులు ధాన్యం విక్రయించారు. ఈ సీజన్‌లో 4 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని అంచనా వేస్తున్నారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని జేసీ అన్నారు.