News September 16, 2025
చర్లపల్లి-తిరుపతి-చర్లపల్లి ప్రత్యేక ఎక్స్ప్రెస్ రైలు రద్దు

ఇటీవల నంద్యాల మీదుగా ప్రయాణించే విధంగా ప్రకటించిన చెర్లపల్లి-తిరుపతి – చర్లపల్లి (07013/07014) వీక్లీ రైలును కార్యాచరణ పరిమితుల దృష్ట్యా అక్టోబర్, నవంబర్ నెలలకు గాను రద్దు చేశారు. దీనికి బదులుగా ఆ నెలల్లో 07001/07002 నంబర్ గల ప్రత్యేక ఎక్స్ప్రెస్ రైలును ఏర్పాటు చేశారు. రైలు సమయాలలో ఎటువంటి తేడా లేదు. ప్రయాణికులు గమనించాలని రైల్వే అధికారులు కోరారు.
Similar News
News September 16, 2025
నోటిఫికేషన్ విడుదల చేసిన APPSC

AP: రాష్ట్రంలో 21 ఉద్యోగాలకు APPSC నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. లైబ్రేరియన్ సైన్స్లో జూనియర్ లెక్చరర్ 2, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ 1, డ్రాఫ్ట్స్మన్ గ్రేడ్-2 (టెక్నికల్ అసిస్టెంట్)- 12+1, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (సివిల్)- 3, హార్టికల్చర్ ఆఫీసర్- 2 పోస్టులు ఉన్నాయి. రేపటి నుంచి అక్టోబర్ 7 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని APPSC తెలిపింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ <
News September 16, 2025
అక్రమాస్తుల కేసుల విచారణకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్

ఏపీ ఏసీబీ నమోదు చేసిన అక్రమాస్తుల కేసుల విచారణకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. విజయవాడ సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్కి పోలీస్ స్టేషన్ హోదా లేదని 11 FIRలను హైకోర్టు కొట్టివేయగా ఏసీబీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ధర్మాసనం కేసులపై విచారణకు, ఛార్జ్షీట్ల దాఖలుకు అనుమతినిచ్చింది.
News September 16, 2025
మంజీరా నది ఉరకలేస్తుంది..!

ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వరప్రదాయిని నిజాంసాగర్ ప్రాజెక్టుకు వరద ఉద్ధృతి మళ్లీ పెరిగింది. దీంతో ప్రాజెక్టులోని తొమ్మిది గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఈ వరద ఉద్ధృతి కారణంగా పిట్లం మండలం బొల్లక్ పల్లి మంజీరా బ్రిడ్జి వద్ద మంజీర నది ఉరకలేస్తూ ప్రవహిస్తోంది. ప్రస్తుతం ప్రాజెక్టు నుంచి ఔట్ఫ్లో 62,542 క్యూసెక్కులుగా ఉంది.