News September 16, 2025
అన్నమయ్య: సన్నిహితులే రాక్షసులు

మన చుట్టూ సన్నిహితంగా ఉండే వారే రాక్షసులుగా మారి బాలికల్ని చిదిమేస్తున్నారు. నిన్న అన్నమయ్య జిల్లాలోని <<17714750>>మదనపల్లె<<>>, <<17720487>>తంబళ్లపల్లె<<>>లో జరిగిన 2 అత్యాచార ఘటనలు బాలికలపై ఉన్న భద్రతను ప్రశ్నిస్తున్నాయి. ఎవర్ని నమ్మాలి? ఎవర్ని నమ్మకూడదనే భయాన్ని తల్లిదండ్రుల్లో కలిగిస్తున్నాయి. ఇలాంటి నరరూప రాక్షసులను కఠినంగా శిక్షించాలనే డిమాండ్ సర్వత్రా వినిపిస్తోంది.
Similar News
News September 17, 2025
SRCL: ‘మహిళల ఆరోగ్యానికి ప్రత్యేక క్యాంపులు నిర్వహించాలి’

మహిళల ఆరోగ్యంపై అవగాహన కల్పించేందుకు ప్రతిరోజూ ప్రత్యేక క్యాంపులు నిర్వహిస్తామని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు. మంగళవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఆయన ‘స్వస్త్ నారీ, సాశక్త్ పరివార్ అభియాన్’ కార్యక్రమంపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమం ద్వారా మహిళల ఆరోగ్య సమస్యలపై ప్రత్యేక శ్రద్ధ వహించి అవగాహన పెంచడం జరుగుతుందని కలెక్టర్ పేర్కొన్నారు.
News September 16, 2025
సకాలంలో బాల సంజీవిని కిట్లు అందించాలి: జేసీ

బాల సంజీవిని కిట్లను సకాలంలో అంగన్వాడీ కేంద్రాలకు అందేలా పర్యవేక్షించాలని సంబంధిత అధికారులను జేసీ రాహుల్ ఆదేశించారు. మంగళవారం భీమవరంలో జేసీ ఛాంబర్లో జిల్లా స్థాయి సప్లిమెంటరీ న్యూట్రిషన్ ప్రోగ్రాం మానిటరింగ్ రివ్యూ కమిటీ సమావేశాన్ని సంబంధిత కమిటీ సభ్యులతో నిర్వహించారు. గర్భిణులు, బాలింతలకు ప్రభుత్వం ప్రతినెలా అందిస్తున్న పోషకాహార సరుకులను నాణ్యతతో నిర్ణీత సమయానికి అందజేయాలన్నారు.
News September 16, 2025
ఈనెల 18న వేములవాడ హుండీ లెక్కింపు

వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో హుండీ లెక్కింపు ఈనెల 18న ఉదయం 8 గంటలకు జరగనుంది. దేవస్థానం కార్యనిర్వహణాధికారి మంగళవారం ఈ విషయాన్ని తెలిపారు. ఈ లెక్కింపులో భక్తులు సమర్పించిన నోట్లు, నాణేలు, బంగారం, వెండి ఆభరణాలు ఉంటాయని చెప్పారు. అధికారుల సమక్షంలో, లెక్కింపు కమిటీ పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరుగుతుందని పేర్కొన్నారు.