News September 16, 2025

వనపర్తి: పోక్సో చట్టంపై అవగాహన కల్పించాలి: కలెక్టర్

image

ఉపాధ్యాయులు విద్యార్థులకు పోక్సో చట్టంపై నిరంతరం అవగాహన కల్పించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. మంగళవారం ఐడీఓసీ సమావేశ మందిరంలో ఎస్పీ గిరిధర్‌తో కలిసి ఉపాధ్యాయులకు ఈ చట్టంపై అవగాహన కల్పించారు. సమాజంలో చిన్నారులపై నేరాలను అరికట్టడంలో ఉపాధ్యాయుల పాత్ర చాలా ముఖ్యమని కలెక్టర్, ఎస్పీలు తెలిపారు. విద్యార్థులకు ఈ చట్టం గురించి బోధించాలని, ఏదైనా సమస్య ఉంటే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.

Similar News

News September 17, 2025

ఉమ్మడి విశాఖలో 9మందికి ఎంపీడీవోగా పదోన్నతలు

image

ఉమ్మడి విశాఖ జిల్లాలో పనిచేస్తున్న 9 మంది ఏవో, ఈవో (EO PR&RD)లకు ఎంపీడీవోలుగా పదోన్నతి పొందారని జడ్పీ సీఈవో పి.నారాయణమూర్తి తెలిపారు. వారికి నియామక ఉత్తర్వులను జడ్పీ ఛైర్పర్సన్ జల్లిపల్లి సుభద్ర అందజేశారు. పదోన్నతి పొందిన వారు జి.కె. వీధి, బుచ్చయ్యపేట, రావికమతం, కశింకోట, కోటవురట్ల, నాతవరం, ఎస్.రాయవరం, పాయకరావుపేట, ముంచింగిపుట్టు మండలాలకు ఎంపీడీవోలుగా వెళ్లనున్నారు.

News September 17, 2025

భీమారం: రైతులు ఆందోళన చెందవద్దు: కలెక్టర్

image

జిల్లాలో వ్యవసాయ సాగుకు అవసరమైన మేరకు యూరియా పంపిణీ చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ చెప్పారు. భీమారం మండల కేంద్రంలో వ్యవసాయ అధికారి సుధాకర్‌తో కలిసి రైతులతో మాట్లాడారు. మండలంలో గత సంవత్సరం 14 మెట్రిక్ టన్నుల యూరియా వినియోగించబడిందని, ఈ సంవత్సరం ఇప్పటికే 11 మెట్రిక్ టన్నుల యూరియా పంపిణీ చేశామన్నారు. రైతులు ఆందోళన చెందవద్దని, వ్యవసాయ సాగుకు అవసరం మేర యూరియా అందిస్తామన్నారు.

News September 17, 2025

నేటి నుంచి మహిళకు ఉచిత వైద్య పరీక్షలు: అనకాపల్లి జేసీ

image

మహిళల ఆరోగ్య పరిరక్షణకు స్వస్త్ నారీ సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమం ఎంతో దోహదం చేస్తుందని అనకాపల్లి జేసీ ఎం.జాహ్నవి అన్నారు. ఈ పథకానికి సంబంధించి గోడ పత్రికను జాయింట్ కలెక్టరు కార్యాలయ ఛాంబర్ మంగళవారం ఆవిష్కరించారు. జిల్లాలోని 46 ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలలో నేటి నుంచి అక్టోబర్ 2 వరకు మహిళలకు వివిధ రకాల స్క్రీనింగ్ పరీక్షలు చేసి అవసరమైన వైద్య సహకారాన్ని అందిస్తామన్నారు.