News September 16, 2025
అక్రమాస్తుల కేసుల విచారణకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్

ఏపీ ఏసీబీ నమోదు చేసిన అక్రమాస్తుల కేసుల విచారణకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. విజయవాడ సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్కి పోలీస్ స్టేషన్ హోదా లేదని 11 FIRలను హైకోర్టు కొట్టివేయగా ఏసీబీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ధర్మాసనం కేసులపై విచారణకు, ఛార్జ్షీట్ల దాఖలుకు అనుమతినిచ్చింది.
Similar News
News February 24, 2026
‘యంగ్ అండ్ ఫిట్’గా ఉన్నా.. ఈ క్యాన్సర్లు రావొచ్చు!

వయసుతో సంబంధం లేకుండా యువతలోనూ 6 రకాల క్యాన్సర్లు వేగంగా విస్తరిస్తున్నాయని హార్వర్డ్ స్టడీ హెచ్చరించింది. ముఖ్యంగా కొలొరెక్టల్, సర్వైకల్, క్లోమ, ప్రోస్టేట్, కిడ్నీ క్యాన్సర్లతో పాటు మల్టిపుల్ మైలోమా కేసులు యూత్లో పెరుగుతున్నాయి. ఒబెసిటీ, పొల్యూషన్, ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం దీనికి కారణాలు. ఆరోగ్యంగా ఉన్నామనే అపోహతో టెస్ట్లు చేయించుకోకపోతే వ్యాధి ముదిరి మరణాల రిస్క్ పెరుగుతోందని తేలింది.
News February 24, 2026
ఏ రాశివారు ఏ మంత్రం పఠించాలి? (1/2)

మేష రాశి : ఓం శ్రీం లక్ష్మీనారాయణాయ నమః
వృషభ రాశి : ఓం గోపాలాయ ఉత్తర ధ్వజాయ నమః
మిథున రాశి : ఓం క్లీం కృష్ణాయ నమః
కర్కాటక రాశి : ఓం హిరణ్యగర్భాయ అవ్యక్తరూపిణే నమః
సింహ రాశి : ఓం క్లీం బ్రహ్మనే జగదాధారాయ నమః
కన్యా రాశి : ఓం హ్రీం పీతాంబరాయ నమః
News February 24, 2026
అలాంటి పత్తి విత్తనాలను కొనొద్దు

TG: కేంద్రం అనుమతి లేని HT(Herbicide tolerant) పత్తి విత్తనాలను రాష్ట్రంలో అమ్మకుండా అరికట్టాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. ఈ పత్తి విత్తనాలు ఫీల్డ్ ట్రయల్స్లో విఫలమయ్యాయి. పర్యావరణానికి హాని కలుగుతుందని ఈ విత్తనాల వినియోగానికి కేంద్రం అనుమతి ఇవ్వలేదు. ఈ పత్తి విత్తనాలను సాగు చేసినా, అమ్మినా, కొనుగోలు చేసినా చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరించింది.


