News September 17, 2025

సాయుధ రైతాంగ పోరాటంలో తొలి మరణం ఇతనిదే..!

image

తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో తొలి మరణం దొడ్డి కొమురయ్యదే అని చెప్పాలి. 1946 జూలై 4న దేశ్ ముఖ్ ఆకృత్యాలకు వ్యతిరేకంగా కడవెండి గ్రామానికి చెందిన దొడ్డి కొమురయ్య ఎదురొడ్డి నిలబడ్డాడు. శాంతియుతంగా ఆంధ్ర మహాసభల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహిస్తుండగా రజాకార్లు, పోలీసులు ఒక్కసారిగా ఆంధ్ర మహాసభ కార్యకర్తలపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో దొడ్డి కొమురయ్య వీర మరణం పొందాడు. అప్పటి నుంచి పోరాటం ఉద్ధృతం దాల్చింది.

Similar News

News September 17, 2025

కాసేపట్లో ఈ జిల్లాల్లో వర్షం

image

TG: రాబోయే 3గంటల్లో నిజామాబాద్, సిద్దిపేట, భువనగిరిలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, కొత్తగూడెం, HYD, జగిత్యాల, జనగాం, BHPL, కామారెడ్డి, KNR, ఖమ్మం, ఆసిఫాబాద్, మహబూబాబాద్, మంచిర్యాల, మెదక్, మేడ్చల్, ములుగు, నాగర్ కర్నూల్, నల్గొండ, నిర్మల్, PDPL, సిరిసిల్ల, సంగారెడ్డి, సూర్యాపేట, వికారాబాద్, వరంగల్‌ జిల్లాల్లో తేలికపాటి వానలు పడతాయని పేర్కొంది.

News September 17, 2025

సంగారెడ్డి: పాఠశాలల్లో పేరెంట్-టీచర్ మీటింగ్

image

ఈ నెల 20న సంగారెడ్డి జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో తల్లిదండ్రుల-ఉపాధ్యాయుల సమావేశం నిర్వహించాలని జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర్లు బుధవారం ఆదేశించారు. ఈ సమావేశంలో విద్యార్థుల విద్యా ప్రగతి, పాఠశాల అభివృద్ధి, ఇతర ముఖ్యమైన అంశాలపై చర్చించాలని ఆయన సూచించారు. పీటీఎంకు సంబంధించిన వివరాలను మొబైల్ యాప్‌లో నమోదు చేయాలని ప్రధానోపాధ్యాయులకు తెలిపారు.

News September 17, 2025

స్మార్ట్‌ కార్డుల్లో పేరు సరిదిద్దాం: జేసీ

image

అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా పేరును స్మార్ట్‌ కార్డుల్లో చేర్చినట్లు జాయింట్ కలెక్టర్ టి. నిశాంతి తెలిపారు. ఈ మేరకు బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ విషయంపై ప్రభుత్వం తక్షణమే స్పందించిందని చెప్పారు. ఇకపై ఏ ఒక్క కార్డును స్కాన్ చేసినా, ‘అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా’ అని కనిపిస్తుందని ఆమె స్పష్టం చేశారు. అంబేడ్కర్‌ అభిమానుల మనోభావాలను గౌరవించామని ఈ సందర్భంగా ఆమె పేర్కొన్నారు.