News September 17, 2025

HYD: దక్కన్ రేడియోలో నిజాం ఏం చెప్పారంటే?

image

‘నా ప్రియమైన ప్రజలారా హమ్ నే భారత్‌కే సదర్ గవర్నర్ జనరల్ రాజగోపాల చారి గారికి పంపుతున్న సందేశం ఏమిటంటే.. నా రాజీనామా సమర్పించడంతోపాటు రజాకారులను నిషేధించమని కోరుతూ HYD సంస్థానాన్ని భారత్‌లో విలీనం చేయడానికి ఒప్పందం కుదుర్చుకుంటూ ఇస్తున్న సందేశం. ఇకనుంచి ఇక్కడి ప్రజలు భారత ప్రజలతో కలిసి కులమతాలకు అతీతంగా సుఖ సంతోషాలతో భేద భావాలు లేకుండా సామరస్యంగా ఒకే తాటిపై జీవించాలని కోరుతున్నా’ అని ప్రసంగించారు.

Similar News

News September 17, 2025

కామారెడ్డి: ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రగతి: కోదండరెడ్డి

image

కామారెడ్డిలో జరిగిన తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ వేడుకలకు తెలంగాణ వ్యవసాయ రైతుల సంక్షేమ కమిషన్ ఛైర్మన్ కోదండ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. 1948 సెప్టెంబర్ 17న హైదరాబాద్ సంస్థానం రాచరిక వ్యవస్థ నుంచి ప్రజాస్వామ్య వ్యవస్థలోకి మారిన చారిత్రాత్మక ఘట్టాన్ని గుర్తు చేసుకున్నారు. గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం దిశగా రాష్ట్రంలోని పల్లెలు, పట్టణాలు అభివృద్ధి చెందుతున్నాయని అన్నారు.

News September 17, 2025

ప్రపంచ వాస్తుశిల్పి విశ్వకర్మ: జేసీ నిశాంతి

image

అమలాపురం కలెక్టరేట్ భవనంలో వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బుధవారం విశ్వకర్మ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ విశ్వాన్ని సృష్టించిన ఇంజినీర్ విశ్వకర్మ అని, ఆయన ప్రపంచ వాస్తుశిల్పిగా పేరు సంపాదించారని జిల్లా జాయింట్ కలెక్టర్ టి. నిశాంతి అన్నారు. ఈ కార్యక్రమంలో అంబేడ్కర్ కోనసీమ జిల్లాకు చెందిన విశ్వబ్రాహ్మణ సంఘ ప్రతినిధులు పాల్గొన్నారు.

News September 17, 2025

MLC తీన్మార్ మల్లన్న కొత్త పార్టీ

image

TG: రాష్ట్రంలో మరో కొత్త పార్టీ ఆవిర్భవించింది. MLC చింతపండు నవీన్(తీన్మార్ మల్లన్న) ‘తెలంగాణ రాజ్యాధికార పార్టీ’(TRP) పేరుతో రాజకీయ పార్టీని ప్రకటించారు. హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో పలువురు బీసీ ప్రతినిధులతో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈ ప్రకటన చేశారు. ఆత్మగౌరవం, అధికారం, వాటా అనే నినాదాలతో పార్టీ ఆవిర్భవించినట్లు మల్లన్న తెలిపారు. వచ్చే అన్ని ఎన్నికల్లో TRP పోటీ చేస్తుందని వెల్లడించారు.