News September 17, 2025
HYDలో తొలిసారి జాతీయ జెండా ఎగిరిందిక్కడే

దేశవ్యాప్తంగా 1947 AUG 15 నుంచి జాతీయ జెండాలు స్వేచ్ఛగా రెపరెపలాడుతున్న సమయంలో నిజాం ప్రభుత్వం నిరంకుశత్వంలో HYDలో ఎగరనివ్వలేదు. ఏడాది తర్వాత వల్లభాయ్ పటేల్ ఆపరేషన్ పోలో ద్వారా 1948 SEP 17న తొలిసారిగా సికింద్రాబాద్ బొల్లారం రాష్ట్రపతి నిలయంలో జాతీయ జెండా అధికారికంగా రెపరెపలాడి హైదారబాదీల స్వాతంత్య్ర కాంక్షను నెరవేర్చింది. అప్పుడు నిర్మించిన జెండా దిమ్మెను నేటికీ ప్రదర్శనకు అలాగే ఉంచారు.
Similar News
News September 17, 2025
పల్నాడు జిల్లాలో 30.8 మి.మీ వర్షపాతం

పల్నాడు జిల్లాలో గత 24 గంటల్లో 30.8 మి.మీటర్ల సగటు వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. జిల్లాలోని మొత్తం ఐదు మండలాల్లో వర్షం కురిసింది. ఇందులో అత్యధికంగా చిలకలూరిపేటలో 14.4 మి.మీ, నాదెండ్లలో 7.2, పిడుగురాళ్లలో 6.4, నూజెండ్లలో 1.6, ఈపూరులో 1.2 మి.మీ వర్షపాతం నమోదైంది. జిల్లాలో సగటున 1.1 మి.మీ వర్షపాతం నమోదైంది.
News September 17, 2025
జగిత్యాల: ‘మహిళల ఆరోగ్యం, కుటుంబ శక్తివంతం కోసం అభియాన్’

మహిళల ఆరోగ్యం బలోపేతం అయితేనే కుటుంబాలు శక్తివంతంగా ఉంటాయని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాలలోని మాతా శిశు ఆసుపత్రిలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన స్వస్థ నారి ససక్త పరివార్ అభియాన్ (హెల్తీ ఉమెన్ ఎంపవర్ ఫ్యామిలీ కాంపెయిన్)లో పాల్గొన్న సందర్భంగా ఆయన మాట్లాడారు. కార్యక్రమంలో భాగంగా పోషణ మాసం పోస్టర్ ఆవిష్కరణ చేశారు. ప్రతి ఒక్కరు రక్తదానం చేయాలని ప్రతిజ్ఞ చేయించారు.
News September 17, 2025
జగిత్యాల: మహిళలు సంపూర్ణ ఆరోగ్యం సాధించాలి: ఎమ్మెల్యే

మహిళలు పోషక విలువలతో కూడిన ఆహారాన్ని తీసుకొని సంపూర్ణ ఆరోగ్యం సాధించాలని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాల పట్టణంలోని మాతా శిశు కేంద్రంలో బుధవారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళల కోసం చేపట్టిన స్వస్థనారి స్వసక్త పరివార్ అభియాన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోషక విలువలపై కూడిన ఆహారం తీసుకోవాలని మహిళలకు సూచించారు. జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్, అధికారులు పాల్గొన్నారు.