News September 17, 2025
మహానంది: భారీ వర్ష సూచన.. జాగ్రత్త అంటూ సందేశాలు!

‘ఈ రోజు మీ ప్రాంతంలో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. చెట్లు, టవర్స్, పోల్స్, పొలాలు, బహిరంగ ప్రదేశాల్లో ఉండకండి. అప్రమత్తంగా ఉండాలి’ అంటూ ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ నంద్యాల జిల్లాలోని ప్రజల మొబైల్ ఫోన్లకు సందేశాలు పంపింది. ప్రస్తుతం ఆకాశం మేఘావృతమై ఉండటంతో వర్షం పడే అవకాశాలు ఉన్నట్లు కనిపిస్తోంది. పొలాలకు వెళ్లినవారు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు.
Similar News
News September 17, 2025
2.83 కోట్ల చేప పిల్లల విడుదలే లక్ష్యం: కోదండ రెడ్డి

కామారెడ్డి జిల్లాలోని 768 చెరువులలో 100% సబ్సిడీపై 2.83 కోట్ల చేప పిల్లలను విడుదల చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని రాష్ట్ర రైతుల సంక్షేమ కమిషన్ ఛైర్మన్ కోదండ రెడ్డి తెలిపారు. తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా పాల్గొన్న ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో మత్స్యకారుల ఆర్థికాభివృద్ధి కోసం ప్రభుత్వం చేపడుతున్న చర్యలను వివరించారు.
News September 17, 2025
ఓంకారం ఓ ఆరోగ్య సంజీవని

ఓంకారం కేవలం ఆధ్యాత్మిక సాధన మాత్రమే కాదు. ఇది ఓ సంపూర్ణ ఆరోగ్య సంజీవని. నాభి నుంచి పలికే ఈ లయబద్ధమైన శబ్దం శరీరంలోని ప్రతి అణువునూ ఉత్తేజపరుస్తుంది. దీని పఠనం రక్తపోటును తగ్గించి, గుండె ఆరోగ్యానికి తోడ్పడుతుంది. ఇది ఊపిరితిత్తుల పనితీరును, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మానసిక ఒత్తిడి, ఆందోళనలను తొలగించి, అపారమైన ప్రశాంతతను అందిస్తుంది. ఓంకారం మనసు, శరీరం, ఆత్మల ఏకీకరణకు ఓ శక్తిమంతమైన సాధనం.
News September 17, 2025
కుమార స్వామి, సుబ్రహ్మణ్య స్వామి ఒకరేనా?

సుబ్రహ్మణ్య స్వామి, కుమార స్వామి వేర్వేరు కాదు. ఆయన శివ పార్వతుల కుమారుడు. గణపతి, అయ్యప్పలకి సోదరుడు. శివుడి కుమారుడు కాబట్టి కుమారస్వామి అనే పేరొచ్చింది. ఆయణ్నే సుబ్రహ్మణ్య స్వామి, కార్తికేయుడు, షణ్ముఖుడు, మురుగన్ వంటి పేర్లతో కూడా పిలుస్తారు. ఆయనను దేవతల సైన్యాధిపతిగా, జ్ఞానానికి, యుద్ధానికి దేవుడిగా పూజిస్తారు. ఆరు ముఖాలు, పన్నెండు చేతులతో దర్శనమిచ్చే ఆయన ఆధ్యాత్మిక శక్తికి, పవిత్రతకు ప్రతీక.