News September 17, 2025

భూమనకు నోటీసుల అందజేత

image

తిరుమల శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా భూమన కరుణాకరరెడ్డి వ్యవహరిస్తున్నారని ఫిర్యాదు అందడంతో అలిపిరి పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈక్రమంలో భూమన ఇంటికి ఎస్ఐ అజిత వెళ్లి నోటీసులు అందజేశారు. వైసీపీ లీగల్ సెల్ జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. కక్ష్య సాధింపు చర్యల్లో భాగంగానే కేసు పెట్టారని ఆరోపించారు. ఏమాత్రం అవగాహన లేకుండా TTD అధికారి తప్పుడు ఫిర్యాదు చేశారన్నారు.

Similar News

News September 17, 2025

17 నుంచి పోషణ మాసొత్సవాలు: సీతక్క

image

జీవనశైలి మార్పుల సవాళ్లు ఎదుర్కొనేందుకు పోషకాహారం ముఖ్యమని మంత్రి సీతక్క అన్నారు. జిల్లా కేంద్రంలో కేంద్ర సమాచార శాఖ ఫొటో ఎగ్జిబిషన్, పోషణ మాసోత్సవాలను ఆమె ప్రారంభించారు. సీతక్క మాట్లాడుతూ.. ఈ నెల 17 నుంచి వచ్చే నెల 16 వరకు జిల్లాలో పోషణ మాసోత్సవాలను విజయవంతం చేయాలన్నారు. గర్భిణులు, బాలింతలు, పిల్లలు తీసుకోవాల్సిన ఆహారం, పోషణ పర్యవేక్షణపై సభలు సమావేశాలు ఏర్పాటు చేయాలన్నారు.

News September 17, 2025

నిరంతర విద్యుత్‌ సరఫరాకు కృషి చేయాలి: Dy.CM

image

ఖమ్మం జిల్లా ప్రజలకు నిరంతర విద్యుత్‌ సరఫరా అందించడానికి ఉద్యోగులందరూ కృషి చేయాలని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ఖమ్మం పరేడ్ గ్రౌండ్‌లో విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్‌ను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా విద్యుత్ అధికారులతో మాట్లాడిన ఆయన, ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా విద్యుత్ సరఫరా చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఎస్ఈ శ్రీనివాసచారి, తదితరులు పాల్గొన్నారు.

News September 17, 2025

పేదల సంక్షేమమే ప్రజాపాలన ధ్యేయం: Dy.CM భట్టి

image

ఖమ్మం: రాష్ట్రంలో పేదల సంక్షేమం, అభివృద్ధిని లక్ష్యంగా చేసుకుని ప్రజాపాలన కొనసాగుతోందని Dy.CM భట్టి విక్రమార్క అన్నారు. ఖమ్మంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన జాతీయ జెండా ఆవిష్కరించి, ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. రైతాంగం, కూలీలు భూమి, భుక్తి కోసం చేసిన పోరాటాలు అమోఘమైనవని కొనియాడారు.