News April 4, 2024
కృష్ణా: ప్రజలకు ముఖ్య గమనిక
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_42024/1712164615702-normal-WIFI.webp)
ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ(APSDMA) జిల్లాలో గురువారం కింద పేర్కొన్న మండలాల్లో వడగాలులు వీస్తాయని హెచ్చరించింది. ఆయా ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు(డిగ్రీల సెంటీగ్రేడ్లలో) నమోదవుతాయని స్పష్టం చేస్తూ ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది.
☞కంకిపాడు 40.4
☞ఉయ్యూరు 39.9
☞బాపులపాడు 40.6
☞గుడివాడ 39.5
☞గన్నవరం 40.7
☞పెనమలూరు 40.7
☞ఉంగుటూరు 40.4
☞పెదపారుపూడి 39.9
☞తోట్లవల్లూరు 39.9
☞పామర్రు 39.1
Similar News
News February 5, 2025
ఉయ్యూరు: కాలువలో పడి వ్యక్తి మృతి
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738680163076_71682002-normal-WIFI.webp)
ఉయ్యూరు సుందరయ్య నగర్ ప్రాంతానికి చెందిన వ్యక్తి కాలువలో పడి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన సమాచారం మేరకు.. సుందరయ్య నగర్కు చెందిన ఎడ్ల రాంబాబు కూలి పనులు చేస్తూ జీవనం సాగిస్తూ ఉంటాడు. ఈ క్రమంలో మంగళవారం కాలువ అరుగు పై కూర్చుని ఉండగా ప్రమాదవశాత్తు కాలంలో పడి మృతి చెందాడు. మృతదేహాన్ని పోలీసులు వెలికి తీశారు.
News February 5, 2025
కృష్ణా: కేంద్ర పథకాలపై అన్ని శాఖలు దృష్టి సారించాలి- కలెక్టర్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738676645497_60300469-normal-WIFI.webp)
ప్రజల సంక్షేమాభివృద్ధికి ఉద్దేశించిన కేంద్ర ప్రభుత్వ పథకాల సద్వినియోగంపై అన్ని శాఖల అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజి ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులతో ఆయన సమీక్షించారు. ప్రస్తుతం అమలవుతున్న పథకాల ప్రగతితో పాటు ప్రజలకు అవగాహన లేకుండా మరుగున పడిపోయిన కేంద్ర ప్రభుత్వ పథకాలపై అధికారులతో చర్చించారు.
News February 4, 2025
గుడివాడ: లారీ ఢీకొని వ్యక్తి గుర్తుతెలియని మృతి
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738679220782_52120844-normal-WIFI.webp)
గుడివాడ మార్కెట్ సెంటర్లో మంగళవారం సాయంత్రం టిప్పర్ ఢీకొని సైక్లిస్ట్ మృతి చెందాడు. ఏలూరు రోడ్లో నుంచి పామర్రు రోడ్డు వైపు వెళ్తున్న టిప్పర్ మార్కెట్ సెంటర్లోని కటారి సత్యనారాయణ చౌకు వద్ద మలుపులో సైకిల్ మీద వస్తున్న వృద్ధుడిని ఢీకొట్టింది. ఘటనలో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు అక్కడకు చేరుకుని లారీ డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.