News September 17, 2025
అమరావతి: అసైన్డ్ రైతులకు ఊరట

అమరావతి రాజధాని కోసం తమ అసైన్డ్ భూములను ల్యాండ్ పూలింగ్ ద్వారా ఇచ్చిన రైతులకు ప్రభుత్వం ఊరట కల్పించింది. గతంలో రిటర్నబుల్ ప్లాట్లలో ‘అసైన్డ్’ అని పేర్కొనడంతో అవి అమ్ముడుపోవడం లేదని రైతులు ప్రభుత్వానికి విన్నవించారు. ఈ నేపథ్యంలో, ప్రభుత్వం ల్యాండ్ పూలింగ్ చట్టంలోని 9.24లోని కాలమ్ నంబర్ 7, రూల్ నంబర్ 11(4) క్లాజ్ను తొలగిస్తూ జీవో నంబర్ 187ను బుధవారం విడుదల చేసింది.
Similar News
News September 17, 2025
బాయ్కాట్ చేస్తే పాకిస్థాన్ ఎంత నష్టపోయేది?

ఆసియా కప్లో భాగంగా UAEతో మ్యాచ్ను ఒకవేళ పాకిస్థాన్ బాయ్కాట్ చేసి ఉంటే ఆర్థికంగా భారీ నష్టాన్ని ఎదుర్కోవాల్సి వచ్చేది. ఆ దేశ క్రికెట్ బోర్డు సుమారు ₹145కోట్ల ఆదాయం కోల్పోయేది. ఇక మ్యాచ్ను ఉద్దేశపూర్వకంగా బాయ్కాట్ చేసినందుకు క్రమశిక్షణ ఉల్లంఘన చర్యల కింద సుమారు రూ.140కోట్లు ICCకి చెల్లించాల్సి ఉండేదని విశ్లేషకులు అంచనా వేశారు. అంటే మొత్తంగా రూ.285కోట్ల భారం మోయాల్సి వచ్చేదన్నమాట.
News September 17, 2025
మంచిర్యాల: ‘మనువాద వ్యవస్థపై పోరాడిన గొప్ప సంఘ సంస్కర్త పెరియార్’

మంచిర్యాల జిల్లా కేంద్రంలో బుధవారం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పెరియార్ రామస్వామి జయంతి వేడుకలను ఈరోజు ఘనంగా నిర్వహించారు. స్థానిక ఐబీ చౌరస్తాలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద పెరియార్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. వారు మాట్లాడుతూ.. కులం, మతం పేరుతో ఏళ్ల నుంచి అసమానతలకు కారణమైన మనువాద వ్యవస్థపై ఆత్మగౌరవ పోరాటం చేసిన సంఘ సంస్కర్త పెరియార్ అని కొనియాడారు. బహుజన సమాజం ఆయన మార్గంలో నడవాలని కోరారు.
News September 17, 2025
మోదీ పుట్టినరోజు.. లండన్లో పూజలు చేసిన మంత్రి లోకేశ్

భారత ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని, మంత్రి నారా లోకేశ్ లండన్లోని ఇస్కాన్ టెంపుల్లో ప్రత్యేక పూజలు చేశారు. మోదీకి దీర్ఘాయుష్షు ప్రసాదించాలని భగవంతుడిని వేడుకున్నానని లోకేశ్ తెలిపారు. మోదీ మార్గదర్శకత్వంలో ‘వికసిత్ భారత్’ లక్ష్యాన్ని సాధిస్తామన్న నమ్మకం ఉందని లోకేశ్ ధీమా వ్యక్తం చేశారు. ఆయన నాయకత్వంలో భారతదేశాన్ని ప్రపంచంలో అగ్రస్థానంలో నిలబెడతామన్నారు.