News April 4, 2024
బీర్లు తాగేవారికి బ్యాడ్ న్యూస్!
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_42024/1712223299672-normal-WIFI.webp)
గ్రేటర్ హైదరాబాద్లోని బీర్ల తయారీ కంపెనీలు నీటి ఎద్దడితో ఇబ్బందిపడుతున్నాయి. భూగర్భ జలాలు అడుగంటడంతో బీర్ల తయారీకి నీటి కొరత ఏర్పడినట్లు తెలుస్తోంది. నగరంలోని బీర్ల తయారీ కంపెనీలకు రోజుకు 44 లక్షల లీటర్ల నీరు అవసరం. 1999 తర్వాత తొలిసారిగా బీర్ల తయారీపై ఎఫెక్ట్ పడినట్లు కంపెనీల ప్రతినిధులు చెబుతున్నారు. డిమాండ్కు తగ్గట్లు సరఫరా చేయలేక బీర్ల ధరలు పెరిగే అవకాశం ఉందంటున్నారు.
Similar News
News February 5, 2025
రిజర్వేషన్ల కోసమే కులగణన: టీపీసీసీ చీఫ్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_12025/1736960769179_653-normal-WIFI.webp)
TG: రిజర్వేషన్ల కోసమే రాష్ట్రంలో కులగణన సర్వే చేపట్టినట్లు TPCC చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు. పీసీసీలోనూ బీసీ, ఎస్సీ, ఎస్టీలకు 60 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పారు. ‘రాష్ట్రంలో 3.6 శాతం మందే సర్వేలో పాల్గొనలేదు. వీరిలో ఎక్కువగా హైదరాబాద్లోనే ఉన్నారు. అలాగే పార్టీలో ఎంతటివారైనా నియమ నిబంధనలకు కట్టుబడి ఉండాలి. రూల్స్ పాటించని వారిపై కచ్చితంగా చర్యలు ఉంటాయి’ అని ఆయన హెచ్చరించారు.
News February 5, 2025
పేరు మార్పు: ఫోర్ట్ విలియమ్ ఇకపై ‘విజయ్ దుర్గ్’
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738747998209_1199-normal-WIFI.webp)
కోల్కతాలోని ఇండియన్ ఆర్మీ ఈస్ట్రన్ కమాండ్ హెడ్ క్వార్టర్స్ పేరును మార్చినట్టు తెలిసింది. ఫోర్ట్ విలియమ్ బదులు ‘విజయ్ దుర్గ్’గా వ్యవహరిస్తున్నట్టు సమాచారం. 2023, DECలోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని డిఫెన్స్ మినిస్ట్రీ PR, వింగ్ కమాండర్ హిమాన్షు తివారీ చెప్పారని TOI తెలిపింది. అధికారికంగా ప్రకటించనప్పటికీ ఇంటర్నల్ కమ్యూనికేషన్లో విజయ్దుర్గ్నే వాడుతున్నట్టు చెప్పారని వెల్లడించింది.
News February 5, 2025
23న శ్రీశైలానికి సీఎం చంద్రబాబు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738751048563_367-normal-WIFI.webp)
AP: శ్రీశైలం బ్రహ్మోత్సవాలు ఈ నెల 19- మార్చి 1 వరకు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా CM చంద్రబాబు 23న స్వామి, అమ్మవార్లకు పట్టువస్త్రాలు సమర్పిస్తారని ఆలయ అధికారులు తెలిపారు. ఏర్పాట్లను వేగవంతంగా పూర్తి చేసేందుకు దేవస్థాన యంత్రాంగం కృషి చేస్తోంది. పాతాళగంగ వద్ద రక్షణ కంచెలు, మహిళలు బట్టలు మార్చుకునే గదులకు మరమ్మతులు చేస్తున్నారు. అటు శివ దీక్ష భక్తుల కోసం ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేస్తున్నారు.