News April 5, 2024
వైసీపీ ప్రభుత్వంలోనే మైనారిటీల అభివృద్ధి: అవినాశ్
రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వంలోనే మైనారిటీల అభివృద్ధి సాధ్యమైందని కడప పార్లమెంటు సభ్యుడు వైఎస్ అవినాశ్ రెడ్డి పేర్కొన్నారు. కడప వినాయక నగర్ వద్ద ఆటో గ్యారేజ్ మెకానిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఆత్మీయ సమావేశంలో డిప్యూటీ సీఎం అంజాద్ బాషాతో కలిసి ఎంపీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా దాదాపు 100 ముస్లిం కుటుంబాలు వైసీపీలో చేరారు. వీరికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
Similar News
News October 6, 2024
కడప నగరంలో కారు బోల్తా
బిజీగా ఉండే కడప నగరంలోని అప్సర సర్కిల్ వద్ద కారు బోల్తా పడిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. వేగంగా వచ్చిన ఓ కారు అప్సర సర్కిల్ వద్ద బోల్తా పడింది. విషయం తెలుసుకున్న చిన్న చౌక్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఫల్టీ కొట్టిన కారును పరిశీలిస్తున్నారు. ఎంతమందికి గాయాలయ్యాయనే విషయాలు తెలియాల్సిఉంది.
News October 6, 2024
YVU: సెలవులున్నా.. పరీక్షలు యథాతథం
కడప యోగి వేమన విశ్వవిద్యాలయానికి నేటి నుంచి ఈనెల 13 వ తేదీ వరకు దసరా సెలవులు ప్రకటించారు. 14వ తేదీన తరగతులు తిరిగి మొదలవుతాయి. BL, LLB సెమిస్టర్ పరీక్షలు ముందుగా సూచించినట్లు ఈనెల 8, 10వ తేదీల్లో యథావిధిగా కొనసాగనున్నాయి. ఏపీఐసెట్ స్పాట్ అడ్మిషన్లు వైవీయూలో 7వ తేదీ వరకు నిర్వహించనున్నారు.
News October 5, 2024
వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా రాచమల్లు శివప్రసాద్ రెడ్డి
వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేంద్ర కార్యాలయం నుంచి ఆదేశాలు జారీ చేశారు. వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా తనను నియమించడం పట్ల రాచమల్లు వైఎస్ జగన్కు కృతజ్ఞతలు తెలిపారు.