News September 18, 2025

వరంగల్ మార్కెట్లో స్థిరంగా పత్తి ధర

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో బుధవారంతో పోలిస్తే నేడు పత్తి ధర స్థిరంగా ఉంది. బుధవారం క్వింటా పత్తి ధర రూ.7440 ధర పలకగా.. ఈరోజు సైతం అదే ధర పలికింది. కాగా, సోమవారం రూ.7,400 ధర పలకగా.. మంగళవారం రూ.7,480 అయింది. మార్కెట్లో కొనుగోలు-అమ్మకాల ప్రక్రియ జోరుగా కొనసాగుతోంది.

Similar News

News September 18, 2025

వరంగల్ మార్కెట్లో ధాన్యాల ధరలు ఇలా..!

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌కు గురువారం చిరుధాన్యాలు తరలివచ్చాయి. సూక పల్లికాయ క్వింటా రూ.6,500 ధర వస్తే.. పచ్చి పల్లికాయకు రూ.4,100 ధర వచ్చింది. అలాగే మక్కలు (బిల్టీ) రూ.2,280 ధర పలికింది. 5531 రకం మిర్చి క్వింటా రూ.13,200, దీపిక మిర్చి రూ.14 వేలు, పసుపు రూ.10,659 ధర వచ్చినట్లు వ్యాపారులు తెలిపారు.

News September 18, 2025

సంగారెడ్డిలో ఘోర రోడ్డు ప్రమాదం

image

సంగారెడ్డిలోని పోతిరెడ్డిపల్లి చౌరస్తా వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి చెందింది. జాతీయ రహదారి 65పై జహీరాబాద్ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న ట్యాంకర్ లారీ.. రోడ్డు దాటుతున్న మహిళను ఢీకొట్టింది. పైనుంచి వెళ్లడంతో ఆమె శరీర భాగాలు ఛిద్రమయ్యాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదంపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

News September 18, 2025

వరంగల్: తుపాకీ పట్టారు.. తూటాకు బలయ్యారు..!

image

కేంద్రం చేపట్టిన ఆపరేషన్ కగార్‌తో ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన మావోయిస్టు అగ్రనేతలు నేలకొరుగుతున్నారు. ఛత్తీస్‌గఢ్ వరుస ఎన్కౌంటర్లతో అగ్ర నేతలు అమరులవుతున్నారు. ఇప్పటివరకు జనగామకు చెందిన గుమ్మడవెల్లి రేణుక, భూపాలపల్లికి చెందిన గాజర్ల రవి, వరంగల్‌కు చెందిన మోదెం బాలకృష్ణతో పాటు సుధాకర్, ఏసోలు, అన్నై సంతోశ్, సారయ్య, ఇలా ఒక్కొక్కరుగా ఉద్యమ బాటలో ఊపిరి వదులుతున్నారు.