News April 5, 2024
పారిస్ ఒలింపిక్స్ని రష్యా టార్గెట్ చేస్తుంది: మెక్రాన్

ఈ ఏడాది జూలైలో జరిగే పారిస్ ఒలింపిక్స్ని రష్యా లక్ష్యంగా చేసుకుంటుందని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ ఆరోపించారు. తప్పుడు సమాచారం వ్యాప్తితో పాటు మరేవిధంగానైనా రష్యా చర్యలు ఉంటాయని వ్యాఖ్యానించారు. ఉక్రెయిన్తో చేస్తున్న యుద్ధంలో రష్యా తప్పక ఓడిపోతుందని అన్నారు. శత్రుత్వాన్ని తాము ప్రేరేపించమని.. కానీ ఏదొక రోజు యూరోపియన్ దళాలు ఉక్రెయిన్కు మద్దతుగా వెళ్లే అవకాశం ఉందని పేర్కొన్నారు.
Similar News
News April 13, 2026
ఇరాన్ పోర్టులను దిగ్బంధిస్తాం: అమెరికా

అమెరికా, ఇరాన్ మధ్య మరోసారి ఉద్రిక్తతలు తీవ్రమవుతున్నాయి. ఇరాన్ పోర్టుల్లోకి వెళ్లే, వచ్చే అన్ని నౌకలను దిగ్బంధిస్తామని US సైన్యం ప్రకటించింది. ‘ఏప్రిల్ 13న 10AM(US టైం ప్రకారం)కు ఇది మొదలవుతుంది. ఇరాన్ పోర్టులు, దాని తీర ప్రాంతాల్లో కార్యకలాపాలు నిర్వహించే అన్ని దేశాల నౌకలకు వర్తిస్తుంది. ఇరానేతర ఓడరేవులకు వెళ్లే, హార్ముజ్ జలసంధి గుండా వచ్చే ఇతర నౌకలకు ఆటంకం కలిగించబోం’ అని ట్వీట్ చేసింది.
News April 13, 2026
ఆంధ్రా కశ్మీర్ అనంత.. మనదగ్గరా యాపిల్ పంట

AP: ఎక్కువగా చల్లని ప్రదేశాల్లోనే పండే యాపిల్ పంట ఇప్పుడు రాయలసీమకూ విస్తరించింది. అనంతపురం(D) గార్లదిన్నె, కుందుర్పి, పెద్దపప్పూరు మండలాల్లో రైతులు సాగు చేస్తున్నారు. 15 ఎకరాల్లో తోటలు వేశారు. డిసెంబర్లో పూతకు వచ్చిన చెట్లు ఇప్పుడు కాయలు కాసి కోతకొచ్చాయి. ఎకరానికి టన్ను దిగుబడి వచ్చిందని, కిలో ₹120-170 పలుకుతోందని రైతులు చెబుతున్నారు. ‘అనంత యాపిల్’ పేరుతో గిఫ్ట్ ప్యాకులుగానూ విక్రయిస్తున్నారు.
News April 13, 2026
ఇంటర్ ఫలితాలు.. 1000కి 997 మార్కులు

TGలో నిన్న విడుదలైన ఇంటర్ ఫలితాల్లో అమ్మాయిలు అదరగొట్టారు. MPCలో సాయి శ్రేష్ఠిత 1000కి 997, BiPCలో కె.జ్యోత్స్న, హఫ్సాబేగం 1000కి 997 చొప్పున స్కోర్ చేశారు. ఇక ఫస్టియర్ MPCలో పలువురు విద్యార్థులు 470కి 469 మార్కులు సాధించారు. నేటి నుంచి ఈ నెల 20వరకు రీకౌంటింగ్, రీవెరిఫికేషన్కు బోర్డు అవకాశం కల్పించింది. రీకౌంటింగ్కు ప్రతి సబ్జెక్టుకు రూ.100 చొప్పున, రీవెరిఫికేషన్కు రూ.800 చొప్పున చెల్లించాలి.


