News September 19, 2025
జగనన్నా అసెంబ్లీకి వెళ్లు.. YCP ఫ్యాన్స్

AP: మాజీ సీఎం జగన్ <<17754283>>అసెంబ్లీకి<<>> వెళ్లి ప్రజాసమస్యలపై మాట్లాడాలని వైసీపీ ఫ్యాన్స్ ట్వీట్లు చేస్తున్నారు. అసెంబ్లీలో అవమానాలు, విమర్శలు ఎదురైనా, మైక్ కట్ చేసినా సమస్యలపై గళం విప్పితే ప్రజల్లో సానుభూతి వస్తుందని చెబుతున్నారు. రాష్ట్రంలో యూరియా, ఉల్లి, టమాటా ధరలు పడిపోవడం సహా ఎన్నో సమస్యలు ఉన్నాయని, వీటిపై చర్చించి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని సూచిస్తున్నారు. దీనిపై మీ కామెంట్?
Similar News
News January 26, 2026
ఈ 5 రోజులు ఎంతో పుణ్యమైనవి.. ఎందుకంటే?

మాఘ శుద్ధ సప్తమి నుంచి ఏకాదశి వరకు గల 5 రోజులను ‘భీష్మ పంచకాలు’ అంటారు. యుద్ధంలో గాయపడిన భీష్ముడు, సూర్యుడు ఉత్తరాయణంలోకి ప్రవేశించిన తర్వాతే తన ప్రాణాలను విడవాలని నిశ్చయించుకున్నారు. అందుకే సప్తమి నుంచి 5 రోజుల పాటు ఒక్కో ప్రాణాన్ని విడుస్తూ అష్టమి నాటికి సిద్ధమయ్యారు. ఈ 5 రోజులు ఆధ్యాత్మికంగా ఎంతో విశిష్టమైనవి. ఈ సమయంలో చేసే జపతపాలు అనంతమైన పుణ్యఫలాలను ప్రసాదిస్తాయని భక్తుల విశ్వాసం.
News January 26, 2026
మోక్షజ్ఞ ఎంట్రీకి ముహూర్తం ఫిక్స్?

నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ సినీ ఎంట్రీకి ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. వచ్చే నెలలో మోక్షజ్ఞ తొలి సినిమాను లాంచ్ చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇది ‘ఆదిత్య 369’కి సీక్వెల్గా ‘ఆదిత్య 999 మ్యాక్స్’ అనే టైటిల్తో రూపొందనున్నట్లు సమాచారం. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని, ఈ మూవీని క్రిష్ జాగర్లమూడి డైరెక్ట్ చేస్తారని టాక్ వినిపిస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
News January 26, 2026
సోమవారం నాడు ఇలా చేస్తే.. శివానుగ్రహం!

సోమవారం శివుడికి ప్రీతికరమైన రోజు. పార్వతీదేవి 16 సోమవారాలు ఉపవాసంతో శివుని అనుగ్రహం పొందిందని పురాణాల వాక్కు. ఈరోజు భక్తులు బిల్వపత్రాలతో పూజించి, రుద్రాభిషేకం నిర్వహిస్తారు. ఆర్థిక ఇబ్బందులు, కష్టాలు తొలగి కోరికలు నెరవేరాలంటే శివ పూజ సమయంలో ‘శివ చాలీసా’ పఠించడం శ్రేయస్కరం. ఉదయం లేదా సాయంత్రం భక్తితో శివ చాలీసా పఠిస్తే శివుని కృప కలిగి జీవితంలోని సమస్యలన్నీ గట్టెక్కుతాయని పండితులు సూచిస్తున్నారు.


