News September 19, 2025
దుర్గ గుడి ట్రస్ట్ బోర్డ్ ఏర్పాటు ఈ సమయంలో కరెక్టేనా..?

ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ దసరా ఉత్సవాలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సమయంలో కొత్తగా ట్రస్ట్ బోర్డు ఛైర్మన్, సభ్యుల నియామకం, ఆలయ అధికారులు, సిబ్బంది మధ్య సమన్వయం ఎలా ఉంటుందోనని ఆందోళన వ్యక్తమవుతోంది. వీరి మధ్య సమన్వయం లోపిస్తే భక్తులకు ఇబ్బందులు తప్పవని పలువురు అభిప్రాయపడుతున్నారు. అమ్మవారి దర్శనాలు, ఉత్సవాల నిర్వహణపై ఇరువురు ఎలా సమన్వయం చేసుకుంటారో చూడాలి.
Similar News
News September 19, 2025
వారంలో మూడు రోజులు ముచ్చింతల్కు బస్సులు

ఆధ్యాత్మిక కేంద్రం ముచ్చింతల్కు వెళ్లేందుకు ఆర్టీసీ అధికారులు బస్సులు ఏర్పాటు చేశారు. ఈ నెల 20 నుంచి శుక్ర, శని, ఆదివారాల్లో బస్సులు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. JBS, ఆఫ్జల్గంజ్, సికింద్రాబాద్, KPHB, ఉప్పల్, రిసాలాబజార్ ప్రాంతాల నుంచి బస్సులు నడుపుతామన్నారు. ఉదయం, సాయంత్రం వేళల్లో ఈ సౌకర్యం ఉంటుందని వివరించారు.
News September 19, 2025
HYD: మన బతుకమ్మ ఇంటర్నేషనల్ రేంజ్కు లోడింగ్

ఈ ఏడాది బతుకమ్మ వేడుక చరిత్రలోనే కీలక ఘట్టంగా SEP 28న ఎల్బీస్టేడియంలో ఆవిష్కృతం కానుంది. ఒకే వేదికపై 20,000 మంది మహిళలతో బతుకమ్మ ఆడించి, గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించేందుకు పర్యాటకశాఖ నడుం బిగించింది. తెలంగాణ సంస్కృతిని ప్రపంచపటం మీద నిలిపేందుకు, విదేశీ ఎయిర్లైన్ల నుంచి మహిళలను ప్రత్యేకంగా ఆహ్వానించడం ఈ సారి ప్రత్యేక ఆకర్షణ. ఇదే జరిగితే బతుకమ్మ ప్రపంచస్థాయి పండుగగా గుర్తింపు పొందడం ఖాయం.
News September 19, 2025
HYD: మన బతుకమ్మ ఇంటర్నేషనల్ రేంజ్కు లోడింగ్

ఈ ఏడాది బతుకమ్మ వేడుక చరిత్రలోనే కీలక ఘట్టంగా SEP 28న ఎల్బీస్టేడియంలో ఆవిష్కృతం కానుంది. ఒకే వేదికపై 20,000 మంది మహిళలతో బతుకమ్మ ఆడించి, గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించేందుకు పర్యాటకశాఖ నడుం బిగించింది. తెలంగాణ సంస్కృతిని ప్రపంచపటం మీద నిలిపేందుకు, విదేశీ ఎయిర్లైన్ల నుంచి మహిళలను ప్రత్యేకంగా ఆహ్వానించడం ఈ సారి ప్రత్యేక ఆకర్షణ. ఇదే జరిగితే బతుకమ్మ ప్రపంచస్థాయి పండుగగా గుర్తింపు పొందడం ఖాయం.