News September 19, 2025

రైల్వేకు ‘మహిళా శక్తి’ని పరిచయం చేసిన సురేఖ

image

ఆడవాళ్లు రైలు నడుపుతారా? అనే ప్రశ్నలను, అడ్డంకులను దాటుకుని ఆసియాలోనే తొలి మహిళా లోకోపైలట్‌గా మారిన సురేఖా యాదవ్(మహారాష్ట్ర) పదవీ విరమణ పొందారు. ఆమె తన అసాధారణ ప్రయాణంలో ఎంతో మంది మహిళలకు ఆదర్శంగా నిలిచారు. 1988లో అసిస్టెంట్ లోకోపైలట్‌గా మొదలైన ఆమె ప్రయాణం డెక్కన్ క్వీన్ రైళ్లను నడిపే వరకూ సాగింది. ఆమె ఉద్యోగ జీవితం భారతీయ రైల్వేలో మహిళా సాధికారతకు చిహ్నంగా నిలిచిపోతుంది.

Similar News

News January 24, 2026

ధరణి వల్లే భూభారతి స్కామ్: పొంగులేటి

image

TG: BRS ప్రభుత్వం తెచ్చిన ధరణి పోర్టల్‌లో లొసుగులతోనే భూభారతి ద్వారా రిజిస్ట్రేషన్ డబ్బులు కొల్లగొట్టారని మంత్రి పొంగులేటి తెలిపారు. 9జిల్లాల్లో 48మందిపై క్రిమిన‌ల్ కేసులు నమోదు చేశామన్నారు. ధ‌ర‌ణి పోర్ట‌ల్ ప్రారంభ‌మైన‌ప్ప‌టి నుంచి 4,848లావాదేవీల్లో లోటుపాట్లు జ‌రిగిన‌ట్లు గుర్తించామని అధికారులు మంత్రికి తెలిపారు. విచార‌ణలో 1,109డాక్యుమెంట్ల‌కు సంబంధించి రూ.4Cr చెల్లింపులు జరగనట్లు తేల్చామన్నారు.

News January 24, 2026

84 ఏళ్ల డైరెక్టర్‌తో 74 ఏళ్ల హీరో సినిమా

image

మలయాళ ఇండస్ట్రీలో అరుదైన కాంబోలో మూవీ తెరకెక్కనుంది. లెజెండరీ డైరెక్టర్ అదూర్ గోపాలకృష్ణన్ 84 ఏళ్ల వయసులో మళ్లీ దర్శకత్వం చేయనున్నారు. 74 ఏళ్ల మెగాస్టార్ మమ్ముట్టి హీరోగా నటించనున్నారు. 32 ఏళ్ల క్రితం ‘విధేయన్’ వంటి క్లాసిక్ తర్వాత వీరిద్దరూ మళ్లీ కలిసి పనిచేయడం ఇదే తొలిసారి. ‘పాదయాత్ర ’ పేరుతో ఈ కొత్త సినిమా తెరకెక్కనుంది. తెలుగులో మమ్ముట్టి ‘యాత్ర’లో నటించిన విషయం తెలిసిందే.

News January 24, 2026

న్యూజిలాండ్‌పై భారత్ ఘనవిజయం

image

U19-WCలో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. వర్షం ఆటంకం కలిగించడంతో DLS ప్రకారం 130 పరుగులకు కుదించిన <<18946505>>లక్ష్యాన్ని<<>> 13.3 ఓవర్లలోనే ఛేదించింది. కెప్టెన్ ఆయుశ్ 27 బంతుల్లో 6 సిక్సర్లు, 2 ఫోర్లతో 53 రన్స్ చేయగా ఓపెనర్ వైభవ్ 23 బంతుల్లో 3 సిక్సర్లు, 2 ఫోర్లతో 40 రన్స్ చేశారు. వీరిద్దరు ఔటైనా మల్హోత్రా, త్రివేది జట్టును విజయతీరాలకు చేర్చారు. NZ బౌలర్లలో క్లర్క్, సంధు, సంజయ్ తలో వికెట్ తీశారు.