News September 19, 2025

తాగునీటిలో మురుగునీరు కలవడంతోనే సమస్య: సీపీఎం

image

గుంటూరులో డయేరియా వ్యాప్తిపై సీపీఎం జిల్లా కార్యదర్శి వై. నేతాజీ ఆందోళన వ్యక్తం చేశారు. కలుషిత నీటి కారణంగానే ఈ సమస్య తలెత్తిందని, అధికారులు తక్షణమే నివారణ చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. గురువారం జీజీహెచ్‌లో డయేరియా రోగులను పరామర్శించిన అనంతరం ఆయన మాట్లాడారు. ఇప్పటికే 33 మంది చికిత్స పొందుతున్నారని తెలిపారు. వర్షాలకు మురుగు నీరు తాగునీటి పైపుల్లో కలిసి ప్రజలకు సరఫరా అవుతోందని ఆరోపించారు.

Similar News

News September 19, 2025

మాజీ సీఎం జగన్ రూట్ మార్పు

image

తాడేపల్లి నివాసం నుంచి గన్నవరం విమానాశ్రయానికి బయలుదేరిన వైఎస్‌ జగన్‌ ప్రయాణంలో స్వల్ప మార్పు చోటుచేసుకుంది. కనకదుర్గమ్మ వారధి వద్ద రోడ్డు ప్రమాదం కారణంగా ట్రాఫిక్‌ నిలిచిపోవడంతో అధికారులు ప్రత్యామ్నాయ మార్గాన్ని ఎంచుకున్నారు. దీంతో జగన్ వాహనశ్రేణి ప్రకాశం బ్యారేజీ మీదుగా గన్నవరం బయలుదేరింది.

News September 19, 2025

డయేరియా బాధితుల పరిస్థితి నిలకడగా ఉంది: కలెక్టర్

image

డయేరియాపై ప్రజలు ఆందోళన చెందవద్దని కలెక్టర్ తమీమ్ అన్సారియా అన్నారు. బుధవారం 33 మంది డయేరియా లక్షణాలతో జీజీహెచ్‌లో చేరారని, వారి పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు. స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా గురువారం నిర్వహించిన ర్యాలీలో ఆమె మాట్లాడారు. రోగులు కలుషిత ఆహారం తీసుకోవడం వల్ల వ్యాధి ప్రబలిందని వైద్యుల ప్రాథమిక నివేదికలో తేలిందన్నారు. తాగునీటి శాంపిళ్లను సేకరించి పరీక్షలకు పంపుతున్నామన్నారు.

News September 19, 2025

గుంటూరు రైల్వేస్టేషన్‌లో కొత్త సదుపాయం

image

రాబోయే పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకుని రైల్వే శాఖ ప్రయాణికుల కోసం టిక్కెట్ కొనుగోలు ప్రక్రియను మరింత సులభతరం చేసింది. గుంటూరు స్టేషన్‌లో సిబ్బంది ధరించే జాకెట్ల వెనుక భాగాన క్యూఆర్ కోడ్ అమర్చారు. ప్రయాణికులు యూటీఎస్, రైల్ వన్ యాప్ ద్వారా ఆ కోడ్‌ను స్కాన్ చేసి కాగిత రహిత టిక్కెట్లు కొనుగోలు చేయవచ్చు. ఇకపై 5KM లోపు ఇంటి నుంచే జనరల్, ప్లాట్‌ఫామ్, సీజన్ టిక్కెట్లు బుక్ చేసుకునే సౌకర్యం లభిస్తోంది.