News September 19, 2025
పరమానందయ్య శిష్యుల కథలో పరమార్థం ఇదే!

పరమానందయ్య శిష్యులు వాగు దాటాక తమను తాము లెక్కించుకోని కథ గురించి మనందరికీ తెలిసిందే. అయితే ఈ హాస్య కథ వెనుక ఓ గొప్ప పరమార్థం ఉంది. 11 మంది శిష్యులు తమను తాము లెక్కించుకోలేక పది మందే ఉన్నామని బాధపడినట్లుగా, మనం కూడా ఆనందం, సత్యం ఎక్కడో బయట ఉంటాయని బాధపడతాం. వాటి కోసం వెతుకుతాం. ‘అహం బ్రహ్మాస్మి’ అంటే ‘నేనే బ్రహ్మ పదార్థం’ అనే సత్యాన్ని తెలుసుకున్నప్పుడే జీవితం పరిపూర్ణమవుతుందని దీని సారాంశం.
Similar News
News September 19, 2025
దసరా సెలవులు పొడిగించాలని డిమాండ్!

తెలుగు రాష్ట్రాల్లో స్కూళ్లు, కాలేజీలకు దసరా సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే. APలో ఈనెల 22-OCT2 వరకు సెలవులిచ్చి, 3న రీఓపెన్ చేస్తామని పేర్కొన్నాయి. అయితే, పండుగ 2వ తేదీనే ఉందని.. సొంతూళ్లు, బంధువుల ఇళ్లకు వెళ్లిన విద్యార్థులు మరుసటిరోజే ఎలా వస్తారని విద్యార్థి సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. 4వ తేదీ వరకైనా హాలిడేస్ పెంచాలని డిమాండ్ చేస్తున్నాయి. TGలో స్కూళ్లకు ఈనెల 21-OCT3 వరకు సెలవులిచ్చారు.
News September 19, 2025
పండగ సంతోషం లేకుండా చేయడమేనా ప్రజాపాలన: హరీశ్

TG: దసరా స్పెషల్ బస్సుల్లో టికెట్ రేట్లు <<17756948>>సవరించడంపై<<>> BRS నేత హరీశ్రావు ఫైరయ్యారు. ‘పండుగలు వస్తే పల్లె వెలుగు సహా అన్ని రకాల బస్సుల్లో ధరలు విపరీతంగా పెంచి ప్రయాణికుల నుంచి ముక్కు పిండి ఛార్జీలు వసూలు చేయడం దుర్మార్గం. అదనపు సర్వీసుల పేరిట 50% అదనంగా దోపిడీ చేస్తున్నారు. ప్రజలకు బతుకమ్మ, దసరా సంతోషం లేకుండా చేయడమేనా ప్రజాపాలన? ఇదేనా ప్రభుత్వ వైఖరి?’ అని ప్రశ్నించారు.
News September 19, 2025
APPLY: బీటెక్ అర్హతతో 119 ఉద్యోగాలు

భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్(BEML)లో 119 జూనియర్ ఎగ్జిక్యూటివ్(కాంట్రాక్ట్) పోస్టులకు ఈ నెల 26 వరకు <
#ShareIt