News September 19, 2025

HYD: ఇరిగేషన్ అనుమతులు ఇంకెప్పుడు?

image

HYD శివారు ప్రతాపసింగారంలో రైతులు 131 ఎకరాలు LPS కింద ప్రభుత్వానికి ఇచ్చారు. ఇందులో HMDA లేఅవుట్ వేసి రైతులకు- HMDAకు 60:40 నిష్పత్తిలో పంపిణీ చేయనుంది. అయితే భూమి ఇచ్చి 3 ఏళ్లు గడుస్తున్నా ఇరిగేషన్ శాఖ అనుమతులు రాలేదు. ఇటీవల సీఎం రేవంత్ అధికారులను హెచ్చరించిన వారిలో చలనంలేదు. స్వచ్ఛందంగా భూములు ఇచ్చినా అనుమతులు నిలువరించడంపై రైతులు మండిపడుతున్నారు. నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.

Similar News

News September 19, 2025

ANU: ఎంబీఏ, ఎంసీఏ ప్రవేశ పరీక్షా షెడ్యూల్ విడుదల

image

ఆచార్య నాగార్జున విద్యాలయం దూరవిద్య కేంద్రం ఆధ్వర్యంలో 2025-26 విద్యా సంవత్సరానికి గాను రెండేళ్ల ఎంబీఏ, ఎంసీఏ కోర్సులలో ప్రవేశ పరీక్ష షెడ్యూల్ విడుదల చేసినట్లు దూరవిద్య కేంద్రం పరీక్షల కోఆర్డినేటర్ ఆచార్య దిట్టకవి రామచంద్రన్ తెలిపారు. ఈనెల 21వ తేదీ ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా 10 పరీక్ష కేంద్రాలలో మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు ప్రవేశ పరీక్ష జరుగుతుందని చెప్పారు.

News September 19, 2025

కాకినాడ: టీడీపీలో చేరనున్న కర్రి పద్మశ్రీ

image

కాకినాడకు చెందిన ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ ఇవాళ సాయంత్రం టీడీపీలో చేరుతున్నారు. వైసీపీ హయాంలో గవర్నర్ కోటాలో ఆమె ఎమ్మెల్సీ అయ్యారు. అనంతరం ఎమ్మెల్సీ పదవికి, వైసీపీకి రాజీనామా చేశారు. శుక్రవారం సాయంత్రం అసెంబ్లీ ముగిసిన తర్వాత సీఎం సమక్షంలో పార్టీలో చేరుతున్నట్లు ఎమ్మెల్సీ పద్మశ్రీ భర్త నారాయణరావు Way2Newsకు ఫోన్‌లో తెలియజేశారు. కాగా ఆమె రాజీనామాను మండలి ఛైర్మన్ ఇంకా ఆమోదించలేదు.

News September 19, 2025

నెల్లూరు జిల్లాలో వేగంగా MSME పార్కులు

image

సీఎం చంద్రబాబు విజన్-2047లో భాగంగా ప్రతి నియోజకవర్గంలో ఒక MSME పార్క్ లేదా ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ సముదాయం ఏర్పాటు లక్ష్యంగా ప్రభుత్వం వేగంగా కృషి చేస్తోంది. ఇప్పటికే ఆత్మకూరు నారంపేటలో పారిశ్రామికవాడ, నెల్లూరు అర్బన్‌ భగత్‌సింగ్ కాలనీలో రూ.12 కోట్లతో జీ+2 ఫ్యాక్టరీ షెడ్స్ నిర్మాణం జరుగుతుండగా, ఆమంచర్లలో 59 ఎకరాల్లో MSME పార్క్ ఏర్పాటుకు అడుగులు పడ్డాయి. మిగిలిన నియోజకవర్గాల్లో ప్రతిపాదన దశలో ఉన్నాయి.