News September 19, 2025
షెడ్యుల్ ప్రకారం సిలబస్ పూర్తి చేయాలి: అడిషనల్ కలెక్టర్

తరగతి గదిలో విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను పరిశీలించి, షెడ్యుల్ ప్రకారం సిలబస్ పూర్తి చేయాలని అడిషనల్ కలెక్టర్ లెనిన్ వత్సల్ టోప్పో అన్నారు. మరిపెడ పట్టణంలోని మోడల్ స్కూల్ ను ఆయన సందర్శించారు. వంటశాల, స్టోర్ రూం, హాస్టల్ గదులు, తరగతి గదులను, స్టాఫ్ రూం లను పరిశీలించారు. పాఠశాల ఆవరణలో పరిశుభ్రమైన వాతావరణం ఉండాలన్నారు. విద్యార్థుల్లోని సందేహాలను ఎప్పటికప్పుడు నివృత్తి చేయాలన్నారు.
Similar News
News September 19, 2025
ఉత్తమ పనికి రివార్డులు.. తప్పిదాలకు చర్యలు: KMR SP

కామారెడ్డి SP రాజేష్ చంద్ర శుక్రవారం పోలీసు కార్యాలయంలో సిబ్బందితో సమావేశం నిర్వహించారు. విధి నిర్వహణలో నిబద్ధత, క్రమశిక్షణ పాటించాలని సూచించారు. ఇటీవల వరదల సమయంలో సిబ్బంది చేసిన కృషిని ముఖ్యమంత్రి స్వయంగా అభినందించారని గుర్తు చేశారు. ఉత్తమ పని తీరుకు రివార్డులు, తప్పులకు శాఖాపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. హోంగార్డులకు రైన్కోట్లు, ఉలెన్ జెర్సీలను SP అందజేశారు.
News September 19, 2025
బల్లికురవ గ్రానైట్ ఫ్యాక్టరీలో ప్రమాదం.. ఒకరి మృతి

బల్లికురవ మండలం ఉప్పుమాగులూరు పంచాయతీ పరిధిలోని గ్రానైట్ ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాదంలో శుక్రవారం ఒకరు మృతి చెందారు. ఎస్సై నాగరాజు వివరాల మేరకు.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మీర్జాపూర్ జిల్లా చునార్ గ్రామానికి చెందిన రాకేష్ కుమార్(30) గ్రానైట్ ముడి రాయిని ఎత్తే సమయంలో క్రేన్ గొలుసు తెగి మీద పడింది. దీంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు.
News September 19, 2025
నక్సలైట్లూ మన అన్నదమ్ములే కదా: రేవంత్

TG: నక్సలైట్ల ఏరివేతకు కేంద్రం చేపట్టిన ఆపరేషన్ కగార్పై CM రేవంత్ స్పందించారు. ‘నక్సలైట్లు లొంగిపోవడానికి గత ప్రభుత్వాలు కొన్ని పాలసీలు తీసుకొచ్చాయి. వారికి జనజీవన స్రవంతిలో కలిసేందుకు అవకాశముంది. టెర్రరిస్టులతో చర్చలు జరపడానికి కేంద్రం సిద్ధంగా ఉన్నప్పుడు నక్సలైట్లతో చర్చించడంలో ఇబ్బంది ఏంటి? వాళ్లు కూడా మన అన్నదమ్ములే కదా? నక్సలైట్ల లొంగుబాటు విషయంలో కేంద్రం దయ చూపాలి’ అని వ్యాఖ్యానించారు.