News September 19, 2025

గద్వాలలో కాంగ్రెస్‌కు భారీ షాక్..?

image

జిల్లాలో కాంగ్రెస్‌కి భారీ షాక్ తగలనుందని స్థానికులు అనుకుంటున్నారు. కేటీదొడ్డి, మల్దకల్, ధరూర్ మండలాలకు చెందిన పలువురు మాజీ ప్రజాప్రతినిధులు BRSలో చేరేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. BRS గద్వాల ఇన్‌ఛార్జ్ బాసు హనుమంతు నాయుడు ఆధ్వర్యంలో వీరంతా తెలంగాణ భవన్‌లో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR సమక్షంలో గులాబీ కండువా కప్పుకోనున్నారని చెబుతున్నారు. ఈ విషయం ఇప్పుడు జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.

Similar News

News September 19, 2025

ఉత్తమ పనికి రివార్డులు.. తప్పిదాలకు చర్యలు: KMR SP

image

కామారెడ్డి SP రాజేష్ చంద్ర శుక్రవారం పోలీసు కార్యాలయంలో సిబ్బందితో సమావేశం నిర్వహించారు. విధి నిర్వహణలో నిబద్ధత, క్రమశిక్షణ పాటించాలని సూచించారు. ఇటీవల వరదల సమయంలో సిబ్బంది చేసిన కృషిని ముఖ్యమంత్రి స్వయంగా అభినందించారని గుర్తు చేశారు. ఉత్తమ పని తీరుకు రివార్డులు, తప్పులకు శాఖాపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. హోంగార్డులకు రైన్‌కోట్లు, ఉలెన్ జెర్సీలను SP అందజేశారు.

News September 19, 2025

బల్లికురవ గ్రానైట్ ఫ్యాక్టరీలో ప్రమాదం.. ఒకరి మృతి

image

బల్లికురవ మండలం ఉప్పుమాగులూరు పంచాయతీ పరిధిలోని గ్రానైట్ ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాదంలో శుక్రవారం ఒకరు మృతి చెందారు. ఎస్సై నాగరాజు వివరాల మేరకు.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మీర్జాపూర్ జిల్లా చునార్ గ్రామానికి చెందిన రాకేష్ కుమార్(30) గ్రానైట్ ముడి రాయిని ఎత్తే సమయంలో క్రేన్ గొలుసు తెగి మీద పడింది. దీంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు.

News September 19, 2025

నక్సలైట్లూ మన అన్నదమ్ములే కదా: రేవంత్

image

TG: నక్సలైట్ల ఏరివేతకు కేంద్రం చేపట్టిన ఆపరేషన్ కగార్‌‌పై CM రేవంత్ స్పందించారు. ‘నక్సలైట్లు లొంగిపోవడానికి గత ప్రభుత్వాలు కొన్ని పాలసీలు తీసుకొచ్చాయి. వారికి జనజీవన స్రవంతిలో కలిసేందుకు అవకాశముంది. టెర్రరిస్టులతో చర్చలు జరపడానికి కేంద్రం సిద్ధంగా ఉన్నప్పుడు నక్సలైట్లతో చర్చించడంలో ఇబ్బంది ఏంటి? వాళ్లు కూడా మన అన్నదమ్ములే కదా? నక్సలైట్ల లొంగుబాటు విషయంలో కేంద్రం దయ చూపాలి’ అని వ్యాఖ్యానించారు.